ఎదులాపురం, అక్టోబర్ 27 : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన సైకిల్ర్యాలీ, పట్టణంలోని పలు చౌక్ల గుండా సాగింది. ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది.
ఈ ర్యాలీలో 350 మంది పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారి సేవలు ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్జాన్రావు, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, బీ రఘుపతి, కే మల్లేశ్, జే కృష్ణమూర్తి, జీ మల్లేశ్, ఆర్ఐ సీఐలు డీ వెంకటి, బీ శ్రీపాల్, ఎం వంశీకృష్ణ, జీ వేణు, ఎస్ఐలు హరిబాబు, సాయన్న, ప్రైవేట్ ట్రావెల్స్ అండ్ ఓనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కానిస్టేబుళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.