కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులను ఎంపిక చేసి వారి చేత ‘ప్రకృతి వ్యవసాయం’ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి కావాల్సిన శిక్షణను 500 మంది రైతులకు అందిస్తున్నది.
రైతులపై వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని తగ్గించేందుకు రైతు బంధు, సబ్సీడీ విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నది. ఆయిల్ పామ్ తోట, ఉద్యానవనాలు ప్రత్యేక రాయితీల ద్వా రా బిందు సేధ్యం వంటి పరికరాలను సబ్సిడీపై అందజేస్తోం ది. తక్కువ ఖర్చుతో సాగయ్యే పంటలను ప్రోత్సహించేందు కు అనేక పథకాలను రాయితీలతో అమలు చేస్తోంది. రైతులను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రోత్సహిస్తున్నది. ప్రకృతి సేద్యంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం ఏమాత్రం ఉండదు.
సహజసిద్ధమైన విత్తనాలతోనే ఈ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది.జిల్లాలో ఎక్కువ శాతం రైతులు పత్తి, సోయా వంటి వాణి జ్య పంటను మినహాయిస్తే జొన్న, మక్క పంటలను సహజ సిద్ధంగానే సాగుచేస్తున్నారు. పత్తి, వరి, సోయా, కూరగాయలు సాగు చేసే రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను నడిపించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.