సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి సత్యవతీ రాథోడ్
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి లో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతీ రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 1000 పోస్టులను భర్తీ చేయాలని కోరిన వెంటనే సీఎం కేసీఆర్, భర్తీ చేయించారని ఆమె గుర్తు చేశారు. సింగరేణిపై ఆయనకు వెలకట్టలేని అభిమానం ఉన్నదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పదే పదే చెప్తారని ఆమె పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో సింగరేణి ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజన ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేషన్ అ ధ్యక్షుడు భాసర్రావు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులున్నారు.
క్యాలెండర్ ఆవిష్కరించిన డైరెక్టర్లు
కొత్తగూడెం సింగరేణి, జనవరి 3:సింగరేణి గిరిజన ఉద్యో గుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను సింగరేణి డైరెక్టర్లు (ఆపరేషన్స్, పా) చంద్రశేఖర్, (ఫైనా న్స్, పీపీ) బలరాం, (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు మంగళ వారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.