ఎదులాపురం, మార్చి 17 : వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే సీపీఆర్ ఏ విధంగా చేయాలనే విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా పోలీస్, మెడికల్, పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్లైన్ వారియర్స్ సిబ్బంది ప్రజలతో కలిసి ఉంటారని పేర్కొన్నారు. వారందరికీ సీపీఆర్పై అవగాహన కలిగి ఉండేం దుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్ర మాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్ట్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి చాలా ముఖ్యమన్నారు. గుండె సంబంధ సమ స్యలు 88 శాతం ఇండ్లలోనే జరుగుతాయని పేర్కొన్నారు. సీపీఆర్పై ప్రతి ఒక్కరూ తెలుసు కొని ఆపత్కాలంలో సహకారం అందించాల న్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ మాట్లాడుతూ ప్రతి రోజూ నడక, వ్యాయామం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చన్నారు. సీపీఆర్ పద్ధ్దతి ద్వారా ప్రాణాలు కాపాడే బృహత్తర కార్యకమాన్ని ప్రజ లందరూ తెలుసుకోవాలన్నారు.
డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బుల బారిన పడి మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, గంజాయి, మత్తు పదార్ధాలు సేవించడం ద్వారా గుండె బబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీపీఆర్తో మర ణాల రేటు తగ్గించవచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ మనోహర్ మాట్లాడుతూ దశల వారీగా జిల్లాలోని అన్ని వర్గాలకు సీపీఆర్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం స్క్రీనిం గ్, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్లు చంద్ర శేఖర్ స్వామి, వంశీ, హరీశ్ నిర్వహించారు. కార్యక్రమంలో రిమ్స్ దవాఖాన సూపరింటెం డెంట్లు డాక్టర్ అశోక్, ఇంద్రీస్ అక్బానీ, ట్రాఫిక్ ఎస్ఐ జీ అప్పారావు, కానిస్టేబుళ్లు, మెడికోలు, తదితరులు పాల్గొన్నారు.