ఫర్టిలైజర్సిటీ, జనవరి 3: రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ల బదిలీ చేయగా, ఇక్కడ సీపీగా ఉన్న రెమా రాజేశ్వరిని హైదరాబాద్లోని మహిళా రక్షణ విభాగం డీఐజీగా ట్రాన్స్ఫర్ చేశారు.
ఆమె స్థానంలో జోగులాంబ గద్వాల జోన్కు డీఐజీగా ఉన్న శంకర్ చౌహాన్ ఇక్కడికి వస్తున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 అధికారిగా పనిచేశారు. 2009లో ఐపీఎస్గా ఉద్యోగోన్నతి పొందారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా ప్రమోషన్ పొంది, జోగులాంబ గద్వాల జోన్కు నియమితులయ్యారు. అలాగే గోదావరిఖని సబ్ డివిజనల్ డీఎస్పీగా 2001 నవంబర్4 నుంచి 2004 జూన్2 వరకు పనిచేశారు.