బాసర, ఫిబ్రవరి 22 : బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం, కానుకల లెక్కింపును మంగళవారం చేపట్టారు. వాగ్దేవి సొసైటీ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఒడి బియ్యం 34క్వింటాళ్లు, ఎండు కొబ్బరి 121 కిలోలు, బరడి పోకలు 12 కిలోలు, పసుపు కొమ్ములు 23 కిలోలు, బాదం 6 కిలోలు, ఖర్జూర పండ్లు 25 కిలోలు సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు.