ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 17 : అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక ఎక్స్రోడ్డులో గల మిత్తల్ జిన్నింగ్ మిల్లు లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ గ్రామ పం చాయతీ పరిధిలోని కేస్లాగూడ(జీ) గ్రామానికి చెందిన రైతులు మెస్రం భీంరావ్, మెస్రం మోతీరాంలు పత్తిని విక్రయించడానికి తీసుకొచ్చారు.
ఆ పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరించారు. కొనుగోలు చేయాలని విన్నవించిన అధికారు లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు పత్తి ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 40 ని మిషాలపాటు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకొన్న ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పత్తి ఎడ్లబండ్లను కొనుగోలు కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీసీఐ కొనుగోలు కేంద్రంలో అసలై న రైతులకు అన్యాయం జరుగుతున్నదని, జిల్లా అధికారులు దృష్టి సారించి పత్తి పంటను కొనుగోలు చేసే లా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. పంటలో నాణ్యత లేకపోవడంతోనే కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నామని సీసీఐ అధికారులు తెలిపారు.