నిర్మల్ అర్బన్, అక్టోబర్ 26 : రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు సత్వర అభివృద్ధి సాధిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈద్గాం నుంచి కౌట్ల (కే) వరకు రూ. 8 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో ప్రతి పల్లెకూ రోడ్డు సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అన్ని గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నార. త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు రూ.4 కోట్లతో ప్యారామూర్ నుంచి కదిలి ఆలయం వరకు రహదారి నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ శాఖ అనుమతి వచ్చిందని వెల్లడించారు.రూ. 9 కోట్లతో వంజర నుంచి కౌట్ల (బీ) వరకు ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాగెడ గజేందర్, సోమేశ్, కుర్ర నరేశ్, తారక రఘువీర్, ఆకోజి కిషన్ ఉన్నారు.
సారంగాపూర్, అక్టోబర్ 26 : సారంగాపూర్ మండలం ప్యారమూర్ నుంచి దిలావర్పూర్ మండలం కదిలి పాపహరేశ్వర మందిరం వరకు నూతనంగా తారు రోడ్డు మంజూరైంది. రూ. 4కోట్ల అంచనా వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సారంగాపూర్ మండల వాసుల 25 ఏళ్ల కల నెరవేరతుంది. ఇది వరకు ప్యారమూర్ నుంచి కదిలి ఆలయం వరకు కచ్చారోడ్డు ఉండేది. ఈ రోడ్డుపై ప్రయాణానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సిర్గాపూర్, దిలావర్పూర్, మాటేగాం గ్రామాల మీదుగా సుదూర ప్రయాణంతో కదిలికి చేరుకునేవారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ దూరభారం తగ్గనుంది. కేవలం 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయాన్ని చేరుకోవచ్చు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈ నిధులను మంజూరు చేయించారు. బుదవారం మంత్రి ఇంటి వద్ద గ్రామస్తులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజ్మహ్మద్, మాజీ వైస్ చైర్మన్ నాగుల రాంరెడ్డి, పంచాయతీరాజ్ డీఈ తుకారాం, ఏఈ శరత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయన్న, ఆలూర్ పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, వీడీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు దయాకర్, నాయకులు కరుణాసాగర్రెడ్డి, పోతారెడ్డి, శ్యామ్రెడ్డి, చిలుక శ్రీనివాస్, తోకల నారాయణ, చెందల సాయన్న, ఎర్ర రాకేశ్ రెడ్డి, కొండ జీవన్ పాల్గొన్నారు.