ఎదులాపురం, నవంబర్ 5 : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యువ నాయకుడు గణేశ్ నాయుడు ఆధ్వర్యంలో కాలనీ చెందిన యువకులు, మహిళలు 300 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు.
రెండు కోట్ల ఉద్యోగాలు జాడ లేదని, మహిళలకు జీరో అకౌంట్ తీపించి అందరి ఖాతాలో రూ.15లక్షల వేస్తానని మభ్యపెట్టారు. ఉచిత గ్యాస్ పంపిణీ అని చెప్పి ఓట్లు దండుకొని అదే ప్రజలపై వంట గ్యాస్ ధరను రూ.1200 పెంచినందుకు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇలాంటి తరుణంలో పేద ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ అందించిందన్నారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.లక్ష 116 అందిస్తున్నదని తెలిపారు.
ఎన్నికల ప్రచారం కాగానే ఏప్రిల్ నెల నుంచి వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, వార్డు కౌన్సిలర్లు బండారి సతీశ్, అశోక్ స్వామి, పందిరి భూమన్న, కొండా గణేశ్, సంజయ్, నాయకులు గోలి శంకర్, ఆశక్క, రమక్క, కస్తాల ప్రేమల, బుజ్జక్క, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 5 : ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పూర్తిగా తగ్గుతూ తన గ్రాఫ్ను పూర్తిగా పడిపోయిందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ను బలపరిచేందుకు ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మొత్తం 200 మంది పార్టీలో చేరారు. రాంనగర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మునీర్, బీజేపీకి చెందిన బట్టు గణేశ్ ఆధ్వర్యంలో 100 మంది, గిమ్మ ఉపసర్పంచ్ టీ రమేశ్, రాజు సతీశ్తో పాటు మరో 100 మంది చేరారు.
వీరికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త ఐక్యమతంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.