మంచిర్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్కు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని, ఆ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవా రం ఎమ్మెల్యే (మంత్రి) క్యాంపు కార్యాలయా న్ని ముట్టడించి, నిరసన తెలిపారు.
పలువురు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అన్నారని, కానీ, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని వారు నిలదీశారు. ముం దు నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారికి ఎం దుకు పదవులు ఇవ్వడం లేదని వారు నిలదీశారు. అజీమొద్దీన్ కుటుంబం పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి పని చేస్తున్నదని, అధికారంలో లేనప్పుడు కూడా వారు పార్టీ కోసం పని చేశారని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన సీనియర్లను కాదని, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎలా పదవులు ఇస్తారని వారు మంత్రి వివేక్ను ప్రశ్నించారు.
ఇదేనా మీరు పార్టీ కోసం కష్ట పడిన వారికి, సీనియర్లకు చేసిన న్యాయం అంటూ వారు మంత్రి వివేక్ను నిలదీశారు. ఈ పద్ధతి బాగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మాత్రం న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఒకే ఇంట్లో వారికి (దగ్గరి, దగ్గరి బంధువులు) ఇచ్చారని వారు మండిపడ్డారు. ఇలాగైతే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డ వారికి మీరు ఏమి న్యాయం చేసినట్లను వారు అన్నారు. ఇప్పటికైనా మా కౌన్సిలర్కు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.