దండేపల్లి, ఏప్రిల్8 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం దండేపల్లి మండల కేంద్రంతో పాటు మేదరిపేట గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను తరిమికొట్టాలన్నారు. పంటలు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనికరం చూపడం లేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని.. పెద్దపెల్లి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సత్యం పాల్గొన్నారు.
గెలిపిస్తే ఐటీ రద్దుకు కృషి చేస్తా
శ్రీరాంపూర్, ఏప్రిల్ 8 : సింగరేణిలో 26 ఏళ్లుగా పనిచేశానని, కార్మికుల కష్టాలు తెలుసని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే బొగ్గు గని కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్పార్పీ-1,-3 గనులతో పాటు సోమవారం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. గనులపై కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేశారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణిలో అనేక హక్కులు కల్పించిన కేసీఆర్పై కార్మికులకు ఎనలేని గౌరవం ఉందన్నారు. సింగరేణిలో 20 వేల మంది యువకులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారందరికీ కేసీఆర్ పట్టాలిచ్చారని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు, టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెట్టం లక్షణ్, పానగంటి సత్తయ్య, పెద్దపల్లి కోటిలింగం, గోపీనాయక్, గొరిగె చేరాలు, మారం శ్రీనివాస్, మేడం తిరుపతి, బత్తుల రాజేశం, పెండ్లి రవీందర్, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ సర్పంచులు మల్లెత్తుల రాజేంద్రపాణి, జగ్గయ్య, టీబీజీకేఎస్ నాయకులు భాస్కర్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్వికాస్, మాజీ ఎంపీటీసీ గుమ్మడి శ్రీనివాస్, వంగ తిరుపతి, జనార్దన్, గర్సె రామస్వామి, జాడి భానుచందర్, గాజం ఎల్లయ్య, బావండ్లపెల్లి నర్సయ్య, బండి తిరుపతి, రఫీక్ఖాన్, రవిగౌడ్, తొంగల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలు అండగా నిలవాలి
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 8: బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, ముస్లింలంతా తమ పార్టీకి అండగా నిలవాలని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. సోమవారం సాయంత్రం నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారులో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాలు, నిరుపేదల ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కోసం షాదీముబారక్, ఇమామ్, మౌజాన్లకు వేతనాలు అందించామని చెప్పారు.
రంజాన్ పండుగకు కానుకలు అందించామని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లింలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, ముస్లిం మతపెద్దలు మహ్మద్ ఇబ్రహీం ఖాద్రీ, మహ్మద్ ఉస్మాన్ ఖాద్రీ, నస్పూర్ జామె మజీద్ సదర్ అర్షద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్కుమార్, నాయకులు జాబ్రిగౌస్, రఫీక్ఖాన్, అబ్బు, సజ్జు, గోగుల రవీందర్రెడ్డి, సంపత్కుమార్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్ పాల్గొన్నారు.