భైంసాటౌన్, డిసెంబర్, 26 : మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వా రికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. అనంతరం మండలంలోని సిద్దూర్ గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం సభ్యులు దేగాంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు.
సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి త్వర లో నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, బీఆర్ఎస్ నాయకులు మేరాజ్, రాచేవాడ్ విశ్వనాథ్, గడ్పాలే దేవీదాస్, గడ్పాలే రాందాస్, గడ్పాలే గంగారాం, తాలోడ్ సిద్దీరాం, తాలోడ్ గణేశ్, గడ్పాలే పరశురాం, అగ్గొల్ల మల్లేశ్, గడ్పాలే ఆనంద్, మారుతి తదితరులు ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కుంటాల, డిసెంబర్, 26 : ప్రజలకు అందుబాటులోఉండి నిస్వార్థంతో సేవలందించాలని ము థోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సూచించారు. కుంటాల ఉప సర్పంచ్గా ఇటీవల సబ్బిడి గజేందర్ ఎన్నిక కాగా, మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి తన నివాసంలో ఎమ్మెల్యేను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉప సర్పంచ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలన్నారు. అలాగే గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టాల్సిన పనులను సర్పంచ్ సమతావెంకటేశ్ ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, అంబుగాం సర్పంచ్ బాపురావ్, బీఆర్ఎస్ నాయకులు చౌహాన్ రాజు, శ్రీరాంవార్ సంతోష్, అరిగెల శంకర్, పవార్ రాజు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
బైంసా, డిసెంబర్, 26 : పట్టణంలోని కిసాన్గల్లీకి చెందిన సాయిరన్వితకు గుండె ఆపరేషన్ కావడంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ. 50 వేలు మంజూరయ్యాయి. కాగా మండలంలోని దేగాం గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లబ్ధిదారు కుటుంబ సభ్యులకు సోమవారం చెక్కును అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.