భీంపూర్, మార్చి 27 : ఈ ఏడాది అతివృష్టి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎండలు ముదురడంతో సాగునీటి వనరులు క్రమంగా అడుగంటిపోతున్నాయి. దీంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దులోని పెన్గంగ ఎండిపోతుండగా, మరో రెండు వారాల్లో పశువులకు తాగునీరు, చేలకు సాగునీరు అందించడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పంటలకు అవసరమైన తడులు అందే పరిస్థితి కనిపించడం లేదు.
సాగునీటి సమస్యలతో పాటు కొన్ని గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోం ది. అర్లి(టీ) బస్టాండ్ సమీప కాలనీలో స ర్పంచ్ అశోక్, పంచాయతీ సిబ్బంది ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గుం జాలలో భగీరథ నీరు అందుతున్నప్పటికీ, వే సవిలో పీవీటీజీ ఇళ్ల నిర్మాణాలకు నీటి కొరత ఎదురవుతోంది. గుట్టమీది గిరిజన పల్లెల్లో తాగునీటి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిస్థితి అదుపు తప్పకముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.