వాంకిడి, ఏప్రిల్ 13 : నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది. గురువారం మా గ్రామంలో కూడా శిబిరం పెట్టారు. నేను వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. ఉచితంగా మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. చూపు మంచిగా కనిపిస్తున్నది.
– కొర్కట సతులబాయి,నవేధారి(వాంకిడి మండలం)