నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 3 : నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన పనులను వేగంగా పూర్తి చేసి అన్ని వసతులు మెరుగుపర్చాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని కార్యాలయాల సేవలు ఒకే దగ్గర నిర్వహించేలా కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. భవన ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు, భవనం లోపల అన్ని వసతులుండేలా చూసుకోవాలన్నారు. ఆయా విభాగాల గదులను పరిశీలించారు. మరుగుదొడ్లు, ప్రహరీ, లిఫ్ట్, తాగునీరు, హెలిప్యాడ్, తదితర పనులను పరిశీలించి మిగిలిపోయిన పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన
పట్టణంలోని నాగనాయిపేట్, బంగల్పేట్లో పూర్తయిన డబుల్బెడ్రూం ఇండ్లను కలెక్టర్ వరుణ్రెడ్డి పరిశీలించారు. ఆయా భవన నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్.. గదుల్లోకి వెళ్లి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు మార్చి 10 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉం డగా.. ఎల్లపెల్లి శివారులో గోదాములో నిల్వ ఉన్న ఈవీఎంలను తనిఖీ చేశారు. రక్షణ చర్యల ను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, ఆర్అండ్బీ ఈఈ అశోక్, పంచాయతీరాజ్ ఈఈ శంకర య్య, డీసీవో శ్రీనివాస్, ఉద్యానవనశాఖ అధికా రి శ్యాంరావ్ రాథోడ్, రాజకీయ పార్టీల నాయకులు హైదర్, రమేశ్, కిషన్ పాల్గొన్నారు.