ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 27: పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ ఆరేండ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.
లింగ సమానత్వంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాల్యం నుంచే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, ప్రస్తుతం వారిపై మొబైల్ ఫోన్ల ప్రభావం ఎకువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మార్పు ముందుగా ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవారి నుంచి రావాలని సూచించారు. పిల్లల ప్రగతికి బాటలు వేయాలంటే పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, విద్య తోనే సాధ్యమని తెలిపారు. డీడబ్ల్యూవో భాసర్, సీడీపీవో సాదియా, కాగజ్నగర్ సీడీపీవో సురేఖ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, మార్చి 27: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా అధికారులు, వైద్యులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం భట్ తో కలిసి వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం అభినందనీయమన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై స్నేహపూర్వక వాతావరణంలో వైద్య సేవలు, చికిత్సలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, లక్ష్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు సలహాలు అందించారు. గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.