వాంకిడి, మార్చి 7 : పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు.
పరీక్షల సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తనిఖీలు చేశాకే కేంద్రంలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిషరించాలని తహసీల్దార్ డీ.రోహిత్కు సూచించారు.