ఆసిఫాబాద్ టౌన్,మార్చి 26 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎన్నికల యాప్లను రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ(స్థానిక సంస్థలు), దాసరి వేణు(రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన సువిధ, సీ-విజిల్, 1950 యాప్లను ఉపయోగించుకోవాలని, ఎన్నికల నిర్వహణలో అభ్యంతరాలుంటే ఫిర్యాదులు, ఇతర ఎన్నికల సంబంధిత సమస్యలుంటే యాప్లు, కంట్రోల్ రూమ్(08733-2790 33)లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు మధుకర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్,మార్చి 26 : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాం డమైజేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సిర్పూర్, ఆసిఫాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి జిల్లా రెవె న్యూ అధికారి లోకేశ్వర్, నోడల్ అధికారి (మ్యాన్ పవర్) అశోక్, తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్ పాం డేతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశలో 3,973 మందికి ర్యాండమైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన విధుల్లో సవరణల కోసం జిల్లా ఎన్నికల అధికారికి దరఖాస్తు రూపంలో అందజేయాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సిబ్బంది శ్రీకాంత్, రాజ్కు మార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.