నిర్మల్ టౌన్, మే 31 : జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, నూతన కలెక్టరేట్ భవన ప్రారంభ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. వివి ధ శాఖల అభివృద్ధిపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. వచ్చే నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నందున జిల్లా అధికారులందరూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విధులకు సక్రమంగా హాజరుకావాలని, అన్ని నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని, విజయగాధ, సం క్షేమ పథకాలు సీడీల రూపంలో ప్రచారం చేయాలని కోరారు. పోలీసు బందోబస్తుపై కూడా ఆయ న సమీక్షించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్రెడ్డి, డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కడెం, మే 31: మండలంలోని కడెంపెద్దూర్ పంచాయతీ పరిధిలోని కలెక్టర్ దత్తత గ్రామం కొలాంగూడలో కిచెన్ గార్డెన్ కార్యక్రమాన్ని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కిచెన్ గార్డెన్ ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలు ఇక్కడే పండించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని మొదట పాఠశాలల్లో అమలు చేయగా, ఇప్పుడు పాఠశాలలతో పాటు సామాజిక కిచెన్ గార్డెన్లను సైతం ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం ఇటీవల కడెం జలాశయం నుంచి కొలాంగూడ ప్రజలకు నేరుగా పైప్లైన్ ద్వారా నీటిని అందిస్తూ, ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేయగా, నీటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఏపీడీ ప్రసాద్, సీడీపీవో సరిత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చిన్నయ్య, ఏపీవో జయదేవ్, ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.