ఆదిలాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తూకం నిర్వహ ణ, పట్టీల జారీ, మౌలిక వసతుల విషయంలో రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
రైతుల విజ్ఞప్తి మేరకు మరో ఐదు కాంటాలు అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కజ్జర్ల, తలమడుగు గోదాముల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధ రైతులపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూ చించారు. ఎండల కారణంగా మార్కెట్ యార్డులో టెంట్లు, మంచినీరు అందుబాటులో ఉంచామని, రాత్రి సమయంలో పంటను దొంగ లు ఎత్తుకపోకుండా భద్రత సిబ్బందిని పెంచాలన్నారు. రవాణ, హమాలీల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, ఎంవీఐ శ్రీనివాస్లు ఉన్నారు.