పెద్దపల్లి, మార్చి22 : పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు దివాకర్, బీ రాహుల్, అరుణశ్రీతో కలిసి ఎన్నికల నిర్వహణపై ఏఆర్వోలతో సమన్వయ సమావేశం ని ర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల, రామగుండంవంటి అర్బన్ ప్రాం తాల్లో ఓటరు నమోదు పెరిగేలా ప్రత్యేక కా ర్యక్రమలు నిర్వహించాలన్నారు
. ప్రతి పో లింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలని, సదుపాయాలు కల్పించాలన్నారు. పార్లమెంట్ పరిధిలో విధులు నిర్వహించే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఇతర బృందాలకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అనుమానాస్పద లా వాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు అందించేలా చూడాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జరగాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ హ కు వినియోగించే అవకాశం కల్పించాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల, చె న్నూర్, మంథని, పెద్దపల్లి ఆర్డీవోలు, డిప్యూ టీ తహసీల్దార్ ప్రవీణ్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.