ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 12 : జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.