నస్పూర్, మార్చి 27 : జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్సింగ్తో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు షెడ్నెట్స్ ద్వారా నీడ, నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అటవీ బీట్ అధికారులు తమపరిధిలోని నర్సరీలను సందర్శించి, మొక్కల ఎదుగుదల, ఇతర అంశాలను పంచాయతీ కార్యదర్శి వద్ద ఉన్న రిజిష్టర్లో నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో కిషన్, అటవీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.