మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 21 : వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాలులో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలు, కళారంగంలో రాణించాలని కోరారు. మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం జానపద పాటలు, నృత్యం, లైఫ్ స్కిల్స్ కాంపోనెంట్ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. న్యాయనిర్ణేతగా శాంకరి వ్యవహరించారు.
యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలను ప్రకటించారు. ప్రథమ స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ డ్యాన్స్లో (ఫోక్) ప్రథమ స్థానంలో అశ్విత్ గ్రూప్(మోడల్ కాలేజ్ రాజీవ్నగర్), ద్వితీయ స్థానంలో ఎం చందన శ్రీ (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మంచిర్యాల) నిలిచారు. సోలో డ్యాన్స్లో (ఫోక్) ప్రథమ స్థానంలో రూపశ్రీ (కేజీబీవీ మంచిర్యాల), ద్వితీయ స్థానంలో టీ అలేఖ్య (టీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్, లక్షిటిపేట) నిలిచారు.
గ్రూప్ సాంగ్లో (ఫోక్) ప్రథమ స్థానంలో ఎస్ కస్తూరి (టీఎస్ డబ్ల్యూఆర్జేసీ, లక్షిటిపేట), ద్వితీయ స్థానంలో ఆముల్యక్ (మైనార్టీ జూనియర్ కాలేజ్, మంచిర్యాల) నిలిచారు. సోలో సాంగ్లో (ఫోక్) ప్రథమ స్థానంలో జీ అంజలి (టీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్, లక్షిటిపేట), ద్వితీయ స్థానంలో కే సరిత (కేజీబీవీ, మంచిర్యాల) నిలిచారు. ఉపన్యాసంలో షగుఫ్ప ఆఫీ న్ ప్రథమ, వర్షిత్ ద్వితీయ, స్టోరీ రైటింగ్లో మనీష సన (కేజీబీవీ, మంచిర్యాల) ప్రథమ, పార్థూయాదవ్ (టీఎంఆర్జేసీ, చెన్నూర్) ద్వి తీయ స్థానంలో నిలిచారు.
పోస్టర్ మేకింగ్లో ప్రథమ స్థానంలో మహిమదాస్ (సినీమావాడ, మంచిర్యాల), సున్షిత (కేజీబీవీ, మంచిర్యాల) ద్వితీయ స్థానంలో నిలిచారు. ఫొటోగ్రఫీలో రేవంత్ మౌర్య ప్రథమ స్థానం, జీ కార్తీక్ (మైనార్టీ గురుకుల, చెన్నూర్) ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, డీఎఫ్వో సత్యనారాయణ, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా అధికారులు దుర్గా ప్రసాద్, పురుషోత్తం నాయక్, ధూమ్ ధాం కళాకారుడు అంతడుపుల నాగరాజు, న్యాయ నిర్ణేతలు అన్నం కల్పన (నాట్య గురువు), శాంకరి, జోష్ణ చంద్రదథ్, డ్యాన్స్ మాస్టర్ మధు, కళాకారులు పాల్గొన్నారు.