నస్పూర్, ఫిబ్రవరి 12 : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మంచిర్యాల, మందమర్రి, లక్షెట్టిపేట, జన్నారం, కన్నెపల్లి, తాండూర్, బెల్లంపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని, రాష్ట్ర స్థాయిలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.