నస్పూర్, జనవరి 5 : ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి నరేందర్తో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ
ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదుచేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
వార్డు ల వారీగా దరఖాస్తు సంఖ్య నమోదు చేయాలని, కులం, పుట్టిన తేదీ,ఆధార్కార్డు, రేషన్కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలను తప్పుల్లేకుండా నమోదు చేయాలని సూచించారు. డాటా ఎంట్రీ సమయం లో ఏవైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టి కి తీసుకురావాలన్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో అందుబాటులో ఉన్న వివిధ శా ఖలకు చెందిన ఆపరేటర్ల వివరాలు సేకరించాలని, నమోదు కార్యక్రమానికి అనుగుణంగా ఆపరేటర్లకు విధులు కేటాయించాలన్నారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధులపై నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.