లక్షెట్టిపేట, జనవరి 4 : సీఎం కేసీఆర్ వల్లే నీళ్లు.. నిధులు సాధ్యమయ్యాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఇటీవల మూడు వాడ ల్లో సుమారు రూ.6 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించుకున్నాక మన నీళ్లు, నిధులు కొట్లాడి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజలకు అందించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్యతో కలిసి 12వ వార్డులో నూతనంగా వేసిన సీసీ రోడ్లను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పలి లింగన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు సురేశ్ నాయక్, చాతరాజు రాజన్న, సాయిని సుధాకర్, పార్టీ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పీఏసీఎస్ చైర్మన్ గోళ్ల కాంతయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, నాయకులు జగన్రెడ్డి, బానాల రమేశ్, నడిమెట్ల రాజన్న, సజ్జు, మెట్టురాజు, అనిల్ రెడ్డి, దొంత నర్సయ్య, గరిసె రవీందర్, షాబొద్దీన్, అన్వర్, అంతకి గంగాధర్, తొగరి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని కొత్తూర్ గ్రామం నుంచి చందారానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ ఉప సర్పంచ్ మోటపల్కుల శ్రీనివాస్ ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పార్టీ మండలాధ్యక్షుడు చిన్నయ్య, గంగాధర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే ప్రధాన లక్ష్యం..
పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 12, 13వ వార్డుల్లో నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై ఆరా తీశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించినట్లు తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ సంఘ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు మెట్టు కళ్యాణిరాజు, సాయిని సుధాకర్, చాతరాజు రాజన్న, సురేశ్ నాయక్, పార్టీ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, బానాల రమేశ్, సజ్జు, దొంత నర్సయ్య, తిరుపతి, షాబొద్దీన్, అనూప్రావు, కొత్త వెంకటేశ్వర్లు, అన్వర్ పాల్గొన్నారు.
తొలిమెట్టు అభినందనీయం
దండేపల్లి, జనవరి 4 : బోధనాభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విద్యా శాఖ రూపొందించిన ఎఫ్ఎల్ఎన్-తొలిమెట్టు కార్యక్రమం అభినందనీయమని పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో బుధవారం ఎంఈవో రవీందర్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 98 టీఎల్ఎం సామగ్రితో మండల స్థాయి బోధనోపకరణాల (తొలిమెట్టు టీఎల్ఎం) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే టీఎల్ఎం మేళాను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. విద్యార్థులు సాధించిన లక్ష్యంపై ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. అధ్యాపకులు నిరంతరం అధ్యయనం చేయాలని, విద్యార్థులకు విషయం నేరుగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తయారుచేసిన టీఎల్ఎం సామగ్రిని పరిశీలించారు.
ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ప్రిన్సిపాల్ శోభ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, ఎంఈవో రవీందర్, టీఎల్ఎం నోడల్ ఆఫీసర్ పర్వతి సత్యనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఉపసర్పంచ్ భూమన్న, ఆయా పాఠశాలల కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు పాల్గొన్నారు.