“కాంగ్రెస్ పాలనంటేనే దరిద్రం. కరెంట్.. నీళ్లు లేక నరకం అనుభవించినం. పంట కాపాడుకునేందుకు రాత్రీ పగలూ పొలాల పొంటే తిరిగేటోళ్లం. మస్తు మంది పురుగూ..బూసి కుట్టి చనిపోయిన్రు. గసొంటి కష్టాలు మళ్లా రాకూడదు. అప్పటి రోజులు తల్సుకుంటనే భయమైతంది. గిప్పుడు ఎలక్ష న్లు వచ్చినయని మళ్లస్తన్రు. 3 గంటల కరెంటిస్తమంటున్నరు. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటు న్నరు. తెలిసీ.. తెలియక ఏదేదో మాట్లాడుతున్రు. మళ్లా ముప్పుతిప్పలు పెట్టేందుకు తయారైత న్రు.” అంటూ రైతులు మండిపడుతున్నారు. ‘హస్తం’ను నమ్మి కష్టాలు కొనితెచ్చుకోలేమని, తర్వాత గోస పడుడేనని చెబుతున్నరు. సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంట్తో రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నామని, మా క్షేమం కోరే బీఆర్ఎస్నే మరోసారి గెలిపించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 23 ( నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ప్రత్యక్ష నరకం చూపించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోయేవని, కరెంటో రామచంద్రా అని పాలకులను వేడుకున్నా కనికరించలేదని మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటుతో రంది లేకుండా పంటలు తీస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 3 గంటలు కరెంటు సరిపోతుందని, 10 హెచ్పీ మోటర్లు వినియోగించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, హస్తం పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితులు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల ఫలితంగా పదేళ్లలో వ్యవసాయం పండుగలా మారిందని కొనియాడుతున్నారు. తిరిగి కరెంటు కష్టాలను కొని తెచ్చుకునే పరిస్థితుల్లో లేమని, తమ అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్నే మరోసారి అధికారంలో నిలబెడుతామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కరెంట్ కష్టాలు అన్ని, ఇన్ని కాదు. మూడు గంటల కరెంట్తో ఒక్క పంట పండించుకునే పరిస్థితి ఉండేది కాదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. పంటలకు నీళ్లు పారించడానికి కరెంట్ మోటర్ల వద్ద పడిగాపులు పడేటోళ్లం. సీఎం కేసీఆర్ అయినాంక మాకు కరెంట్ తిప్పలు తప్పినాయి. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తున్నది. ఎప్పుడు పడితే అప్పుడు మోటర్ వేసుకొని పంటలకు నీళ్లు పారిస్తున్నాం. రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వాళ్ల మాటలు నమ్మితే రైతులు ఆగమైపోతారు. హస్తం పార్టీ నాయకులు ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమే. వాళ్ల మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. సీఎం కేసీఆర్ ఉంటేనే రైతులందరికీ మంచి జరుగుతుంది.
– బండారి ప్రభాకర్. రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం
ఇచ్చోడ, నవంబర్ 23 : కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తే పంటలకు పండించేందుకు సరిపోవు. తెలంగాణ వచ్చాక కరెంట్ కష్టాలు తప్పాయి. సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నది. సీఎం కేసీఆర్ సార్ రైతుబంధు, రుణమాఫీ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ.5లక్షల బీమా అందిస్తున్నారు. కాంగ్రెసోళ్లు పంటల సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెబితే మళ్లీ కష్టాలు షురూ అయినట్లే. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరు భరిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి వ్యవసాయ రంగానికి మేలు చేసేలా లేవు. ఎన్నికల్లో మరోసారి రైతు వ్యతిరేక పార్టీని (కాంగ్రెస్)ను బొందపెడుతాం. కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటాం.
– మేకల శ్రీనివాస్, రైతు, మాధపూర్, ఇచ్చోడ మండలం
నేరడిగొండ, నవంబర్ 23: నా పేరు షేక్ మంజూర్. మాది నేరడిగొండ మండలం. వడూర్ గ్రామం.మేం ఐదుగురు అన్నదమ్ములం. అందరం ఒకే దగ్గర ఉన్నం. మాకు 12 ఎకరాలకు నీటి వసతి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు పంటలు పండిస్తున్నం. రబీలో శనగ, గోధుమ వేసినం.24 గంటలు కరెంటు ఉంటనే మాకు నీళ్ల తడి ఉంటాంది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటుండేది కాదు. ఎప్పడొస్తదో ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. ఇగ గిప్పుడు ఏదో చేస్తమని పిట్ల కథలు చెబుతున్నరు. అసలు వాళ్లు అధికారంలోకి వచ్చుడనేదే కల. ఇగ గిప్పుడు మూడు గంటల కరెంటు, టెన్ హెచ్పీ మోటరంటూ ఉన్న తెలివి బయట పెట్టుకున్నరు. ప్రజలకు మంచిజేసుడు వాల్లకు తెల్వదు. అందుకే ప్రజల మంచి కోరే కేసీఆర్ సారు వెంటే మేమంతా ఉంటం.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే మా బతుకులు పొలంలోనే తెల్లార్తయి. ఎప్పుడు కరెంట్ వస్తదో.. పొలం పారవెట్టుకుందామా అని పొలంలోనే ఉండాల్సి వస్తది. కాంగ్రెసోళ్లు వ్యవసాయం గురించి మాట్లాడితే గిట్లనే ఉంటది. ఇప్పుడు 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇస్తుండ్రు. ఇప్పుడున్న బోర్లు నడుస్తున్నాయి కాదా. మరిమళ్లీ 10 హెచ్పీ మోటర్లు కొనమని చెప్పుడు చూస్తుంటే. రైతుల మీద భారం పడాలని ఈ కాంగ్రెస్ చూస్తున్నట్లు అనిపిస్తున్నది. మా పంటలు పండుతున్నాయి.నీళ్లు పారుతున్నాయి. మేమంతా మంచిగానే ఉన్నాం. మీ అధికారం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదు. కాంగ్రెస్ గెలిచేది లేదు. సచ్చేది లేదు.
– పంద్రం శ్రీకాంత్, రైతు, రాయిగూడ, సిరికొండ మండలం
ఉట్నూర్, నవంబర్ 23 : రేవంత్రెడ్డి ఎవుసానికి మూడు గంటల కరెంటే చాలంటున్నడు. 10హెచ్పీ మోటర్లు పెడుతమంటున్నడు. గీ పని అయ్యేదేనా. మంచిగున్న రైతులను ఆగం చేసేందుకే ఆయన ఇష్టమచ్చినట్టు మాట్లాడవట్టే. మూడు గంటల కరెంటుతో ఒక మడన్న పారుతదా. కాంగ్రెస్ పాలనల నీళ్లు, కరెంటు లేక భూములు అమ్ముకొని చానా మంది వలసకు పోయిన్రు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు 24గంటల కరెంటు ఇయ్యవట్టే. పుష్కలంగా నీళ్లు ఇస్తాండాయె. గిప్పుడు చానా మంది ఊళ్లలో ఎవుసం చేస్తున్నరు. సంతోషంగా ఉన్నరు.
– లావుడ్య పరుశురాం, కొత్తగూడ(చక్పోస్ట్), రైతు
ఉట్నూర్, నవంబర్ 23 : కాంగ్రెసోళ్లు గతంలో రైతులకు చేసిన అన్యాయం చా లదా..? మళ్లా ఏదో చేస్తమ ని జూస్తున్నరు. వీళ్లకు పాల న చేత కాదు. ఎవుసం అం టే తెల్వదు. రైతు ఎట్ల బతుకుతుండో తెల్వదు. వీళ్ల పొ ట్టలు మాత్రం నిండాలె. 10 హెచ్పీ మోటర్ పెట్టి నీ ళ్ల ఇగ్గాలట. గా మోటర్ గీ కాంగ్రెస్ లీడర్లు కొనిస్తరా..? కాంగ్రెసో ళ్లు అధకారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. వీళ్లిప్పుడే గింతగా నం చేస్తున్నరంటే, ఇగ ప్రజలకు మంచి చేసుడైతే ఉండది. మూడు గంటల కరెంటిచ్చి మళ్లీ గోస పెట్టే కాంగ్రెస్కు రైతులెవ్వరూ ఓటెయ్యరు. ఇగ వాళ్ల పని ఖతం.
-జాడి అజయ్,వ్యాపారి, ఉట్నూర్.
ఉట్నూర్, నవంబర్ 23 : వ్యవసాయానికి 10హెచ్పీ మోటార్ ఏ మాత్రం ఉపయోగపడదు. 5 లేదా 3 హెచ్పీ మోటర్లు బిగించుకుంటే సరిపోతుంది. రేవంత్రెడ్డి తెలియక మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. కాంగ్రెష్ హయాంలో కరెంట్ కష్టాలు తప్పలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండే. రైతులను ఆగం చేసే పార్టీలు ఉండకూడదు. సీఎం కేసీఆర్ హయాంలో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటుండ్రు. రైతులకు కరెంట్ కష్టాలు ఏమాత్రం లేవు.
– ఆడె రవీందర్, ఎలక్ట్రిషియన్
ఉట్నూర్, నవంబర్ 23: పల్లెటూర్లలో ఉండే రైతులు విత్తనాలు, ఎరువులు కొనేందుకే పరేషాన్లో ఉంటరు. అటువంటి రైతులు అసలు 10 హెచ్పీ మోటర్ ఎట్ల కొంటరు. ఆ మోటర్ను మెయింటన్ చేయాలంటే అధికంగా విద్యుత్ ఖర్చు అవుతది. దానికి తగ్గట్లు మోటర్ పరికరాలు కావాలె. నీళ్లు కూడ అదే స్థాయిలో ఉండాలె. చాలా మట్టుకు అంతపెద్ద మోటర్ బిగించరు. దాని రిపేర్ ఖర్చులు కూడా ఎక్కువగనే ఉంటయ్. మా ఏరియాలో ఎక్కడ కూడా 10 హెచ్పీ మోటర్ ఏ రైతు బిగించలే. ఎవుసానికి అంత పెద్ద మోటర్ కూడ అవసరం లేదు. ఖర్చు బాగా అయితది. ఈ కాంగ్రెసోళ్ల మాటలు వింటే విచిత్రమనిపిస్తున్నది. వీళ్లకు ఆ ఎవుసం గురించి తెల్వదు.. పోదు. గందుకే రైతులెవ్వలూ కాంగ్రెస్కు ఓటెయ్యరు.
– గుమ్ముల అనిల్, మోటర్ మెకానిక్, ఉట్నూర్
ఉట్నూర్, నవంబర్ 23 : వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నది. ఏజెన్సీ ఏరియాలో అసలే నీటి కొరత ఉంటది. 10 హెచ్పీ మోటర్ వెడితే క్షణాల్లో నీటిని తోడేస్తయ్. అందుకే 10 హెచ్పీ వాడరు. వ్యవసాయలో 3 హెచ్పీ, 5 హెచ్పీ సరిపోద్ది. 10 హెచ్పీ లోడ్ను తట్టుకునే ట్రాన్సఫార్మర్లు కూడా పెట్టాలె. ఇదంతా రైతుల మీదనే పడుతది. ఇగ కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ ఎవుసం బోర్ల కాడ మీటర్లు కూడా పెడుతరు. మొన్న నిర్మల సీతారామన్ కూడా గదే చెప్పింది. కాంగ్రెసోళ్లు కూడా మీటర్లు పెడుతున్నరని. మనకాడ కూడా పెట్టుడు షురూ జేస్తరు. గందుకే కాంగ్రెసోళ్లను, బీజేపోళ్లను అస్సలు నమ్మొద్దు. నమ్మి ఓటేస్తే జనాన్ని నట్టేట ముంచే రకాలు ఈ కాంగ్రెసోళ్లు. రైతులను మంచిగ జూసుకుంటున్న సీఎం కేసీఆర్ వెంటే మేమంతా ఉంటం.
– పోండ్ర శివకుమార్,ఎలక్ట్రిషన్, ఉట్నూర్.
సొనాల, నవంబర్ 23 : కాంగ్రెస్ చెబుతున్నట్లు 10హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేయడం చాలా కష్టం. అధి సన్న, చిన్నకారు రైతులకు భారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ పగలు ఇస్తారా..?రాత్రి ఇస్తారా..? చెప్పడం లేదు. రైతులు 3, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకొని వ్యవసాయం చేస్తుండ్రు. 10హెచ్పీ మోటర్ అనేది పరిశ్రమల్లో వాడుతారు. కాంగ్రెస్ రైతులను అయోమయంలో పడేస్తుంది. 10హెచ్పీ మోటర్ పెడితే ట్రాన్స్ఫార్మర్ల మీద ఒకేసారి లోడ్ పడుతుంది. అప్పుడు లోఓల్టేజీ ఏర్పడి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మళ్లీ పాతరోజులు వస్తాయి. వ్యవసాయంలో నష్టం వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. కాంగ్రెస్కు ఓటు వేస్తే నష్టపోతారు.
– ఆనంద్, రైతు, సొనాల, గుట్టపక్క తండా