మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, జూన్ 9(నమస్తే తెలంగాణ): మంచిరాల్యలో సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ పండుగ వాతావరణంలో ప్రారంభించా రు. హెలీకాప్టర్ ద్వారా మంచిర్యాల నూతన కలెక్ట రేట్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపెల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ ముఖ్య నాయ కులతో కలిసి సీఎం కేసీఆర్ సాయంత్రం 5:15 గంటలకు నస్పూర్ పట్టణ శివారులో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ జెండాను ఎగుర వే శారు. అనంతరం సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన దేవతా ప్రతిమలకు సీఎం ప్రత్యేక పూజలు చేశా రు.
జిల్లా అధ్యక్షుడి చాంబర్లో బాల్క సుమన్ను సీఎం కేసీఆర్ స్వ యంగా కూర్చొబెట్టి పుష్ప గుచ్ఛం అందజేసి అభి నందించారు. బాల్క సుమన్ తన కుటుంబ సభ్యు లతో కలిసి సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకు న్నారు. ఆధునిక హంగు లతో, సువిశాల స్థలంలో నిర్మించిన కార్యాలయాన్ని చూసిన సీఎం బాగుం దని కితాబిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జడ్పీల అధ్యక్షులు నల్లాల భాగ్యలక్ష్మి, కోవలక్ష్మి, రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు రేఖా నాయక్, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ టీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ మోట పలుకుల గురువయ్య, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్ కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, శ్వేత, ఈసం పెల్లి ప్రభాకర్, నల్మాసు కాంతయ్య, జంగం కళ, అర్చన గిల్డా, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్లు ముఖేష్ గౌడ్, తోట శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్రావు పాల్గొన్నారు.
సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆధునిక హంగులతో, సువిశాల స్థలంలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి, రూ.55 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎస్ శాంతి కుమారి, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, అసిస్టెంట్ కలెక్టర్ గౌతమి సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్లో ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుమ్మడి కాయ కొట్టగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నుంచి నీటిని పంపింగ్ ద్వారా చెన్నూర్ నియోజకవర్గంలోని 90వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1658కోట్లతో నిర్మించనున్న చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. దీంతోపాటు మంచిర్యాల నియోజకవర్గంలో రూ.83 కోట్లతో 10వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో పర్ధాన్పెల్లి ఎత్తిపోతల పథకానికి సైతం శంకుస్థాపన చేశారు. రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, 300 పడకల అనుబంధ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.164 కోట్లతో మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులకు కొత్త కలెక్టరేట్ ప్రాంగణం నుంచే సీఎం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు మందమర్రి శివారులో రూ.500 కోట్లతో నిర్మించతలపెట్టిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ కలెక్టర్ బదావత్ సంతోష్ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు.
సీఎం కేసీఆర్, సీఎస్ శాంతి కుమారిలను కలెక్టర్ సంతోష్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకర్షణీయంగా నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులతో పాటు, ఇతర శాఖల అధికారులను సీఎం కేసీఆర్ స్వయంగా సత్కరించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, కుల వృత్తులకు రూ.లక్ష, రెండో విడుత గొర్రెల పథకం, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇద్దరు చొప్పున లబ్ధిదారులకు అందజేసి ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కలెక్టర్ చాంబర్ నుంచి బయటకు వచ్చి ఆవరణ మొత్తాన్ని తిలకించారు.
అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం సీఎం జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు. భవిష్యత్లో మరింత మెరుగ్గా పని చేసి రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ ఇక్కడికి సమీపంలోనే ఉన్న బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.