సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్తో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోతో సంబంధం లేకుండా, సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. కాగా.. జనం భారీగా తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. బీఆర్ఎస్ నాయకులు పాకాల రాంచందర్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో 25 మంది చేరారు.
– సారంగాపూర్, ఏప్రిల్ 4
సారంగాపూర్, ఏప్రిల్ 4 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర్ గార్డెన్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథి గా హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షే మం జరగాలంటే సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారీ గెలిపించుకోవాలని కోరారు. 75 ఏండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారి పోయాయన్నారు. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నా రు. ఎన్నికల మెనిఫెస్టోతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తగా పథకాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఆసరా పింఛ న్లు భారీగా పెంచిందని, ఎవరూ అడుగని రైతుబంధు, రైతుబీమా, గీత, చేనేత కార్మికులకు పిం ఛన్లు, రజక నాయీబ్రాహ్మణుల దుకాణాలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు సన్నబియ్యం ద్వా రా భోజనం, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఇలా.. ఎన్నో పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నా రు. కులవృత్తుల వారికి భరోసా కల్పించేందుకు గొర్రెలు, చేప పిల్లలను ఉచితంగా పంపిణీ వంటి ఎన్నో పథకాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం వచ్చాక పల్లెలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చిందని, ప్రభుత్వం నెలనెలా విడుదల చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతు న్నాయన్నారు. నేడు ఇంటింటికీ సరిపడా మిషన్ భగీరథ నీరు ప్రభుత్వం అందిస్తున్నదని తెలి పారు. ఉద్యమకారుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అ య్యాక తెలంగాణ దేశానికే రోల్మోడల్గా మారిందని గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ జాతీయ పా ర్టీగా ప్రజాదరణ పొందుతున్నదన్నారు. వచ్చే ఎ న్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని పే ర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ అ మలు చేస్తున్న పథకాలు సగం కూడా లేవని, ఆక లిచావులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పింఛన్ రూ.600 మాత్రమే ఉన్న దన్నారు. గతంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే ప్రస్తుతం మోదీ హయాంలో రూ.1200 చేసి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో ఆర్డినేటర్ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో 1200 మంది రైతులకు బీమా పథకం ద్వారా ఆర్థికంగా సాయం చేసినట్లు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 1200 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
రాష్ట్రంలో కంటివెలుగు పథకం కింద కోటి మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది వివిధ పింఛన్లు పొందుతున్నారని, విద్యా వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ విదేశాల్లో ఉన్నత చదువుల కోసం విదార్థులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్న తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకలు పదేపదే నిందించడం సరికాదన్నారు. అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి జనం తరలిరావడంతో ఫంక్షన్హాల్ కిక్కిరిసిపోయింది. బయట కూడా కుర్చీలతో నిండిపోయారు. బీఆర్ఎస్ నా యకులు పాకాల రాంచందర్ ఆధ్వర్యంలో అంబ లి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్, యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరా వు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, పార్టీ నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నిర్మల్ ఎంపీపీ రాజేశ్వర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధ, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజ్మహ్మద్, వంగ రవీందర్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఇప్ప మధూకర్రెడ్డి, సర్పంచ్ సం ఘం అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, సర్పంచ్లు సు జాత, యశోద, నాయకులు జీవన్రావు, ప్రభాకర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, సాగర్రెడ్డి, కండల భోజన్న, దేవిశంకర్, దత్తురాం, హాది, మల్లేశ్, నారాయణరెడ్డి, సాయికృష్ణ, భూమేశ్, లక్ష్మీనారాయణ, సాగర్రెడ్డి, మధు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో 25 మంది చేరిక…
మండంలోని ధని, అడెల్లి, కౌట్ల(బి), దుప్యాతండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి అల్లోల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
కొత్తరేషన్ కార్డులు అందించాలి.. : కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్
ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులు అందించాలని కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్ కోరారు. సెర్ప్ మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ మాఫీ డబ్బులు అందించాలని, మైనార్టీ కమిటీ సచర్ నివేదిక అమలు చేయాలన్నారు.
పత్తి రవాణా చేస్తా..
నా పేరు వెంకట్. నేను డ్రైవర్గా పనిచేస్తా. కరంజి(టీ), వడూర్, గోముత్రి గ్రామాల నుంచి పత్తిని వ్యాన్లో ఆదిలాబాద్ తీసుకెళ్లి మార్కెట్లో విక్రయిస్తా. ఆదిలాబాద్-కరంజి(టీ) వరకు రోడ్డు బాగుంది. వాహ నాల రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. ఆటోలు, నాలు గు చక్రాల వాహనాలు సులభంగా వెళ్లవచ్చు. అధికారులు రోడ్డు బాగు లేకపోతే ఎప్పటికప్పుడు బాగు చేస్తున్నారు.
ఆదిలాబాద్-కరంజి(టీ) రహదారి గుండా మహారాష్ర్టకు ప్రయాణం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి భీంపూర్ మండలంలోని కరంజి(టీ) మీదుగా మహారాష్ట్రలోని మాండ్వి వరకు నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్, సొంత వాహనాల్లో రైతులు పత్తి, కంది, శనగ ఉత్పత్తులను తీసుకెళ్లి విక్రయిస్తారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, బంధువులు, దవాఖానలు, శుభకార్యాలకు ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వాహనాలు నడుస్తాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ)