సోన్, మే 15 : విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికీ తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఏకా గ్రత, పెరుగుతుందని. మే 31వరకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడా పోటీలు నిర్వ హిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
నిర్మల్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం గొప్ప విషయమన్నారు. అదే విధంగా మెడికల్ కళాశాల నిర్మల్ జిల్లాకు రావడంతో వచ్చే జులై, ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, దీంతో ప్రతి సంవత్సరం వంద మంది డాక్టర్లు చొప్పున తయారవుతారని పేర్కొన్నారు. ఎటువంటి మహామ్మారి వచ్చినా ఊరికి ఇద్దరి డాక్టర్లను పంపించి చికిత్స చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు పెరిగి చిన్న వనంలా మారడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రామ సర్పంచ్ కొప్పుల గంగయ్య, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ తహసీల్దార్ ప్రభాకర్, డీఎల్పీవో రమేశ్, ఎంపీడీవో సాయిరాం, పీఆర్టీయూ సంఘం అధ్యక్షుడు నరేందర్, వాలీబాల్ అసోసి యేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాద విజయ్శేఖర్, ఉప సర్పంచ్ ఉల్లెంగ సవితా చిన్నయ్య, ఎంపీటీసీ దుర్కి సాయన్న, వీడీసీ అధ్యక్షుడు వీరమల్ల గంగయ్య, ఉపాధ్యక్షుడు గుడాల తిరుపతి, హెచ్ఎం ప్రశాం త్, వివిధ పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
చెట్ల నీడన సేద తీరి..
సోన్, మే 15 : నిర్మల్ మండలం వెంగ్వా పేట్లోని జడ్పీ హెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి సీఎం కప్ పోటీలను సోమ వారం ప్రారంభించారు. ఆ పక్కనే ఉన్న వనం లో స్టేజీ ఏర్పాటు చేయగా, ఆహ్లాదక రమైన వాతా వరణంలో దాదాపు గంటపాటు కార్యక్ర మం నిర్వహించారు. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఇలా చెట్ల కింద సేద తీరారు. 12 ఏళ్ల క్రితం సామాజిక అడవుల పెంపకం (సోషల్ ఫారెస్ట్రీ) స్కీం కింద నాటిన మొక్కలు ఇలా ఏపుగా పెరిగి నేడు ఎండ నుంచి రక్షణ కల్పించాయని, అందుకే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారంలో భాగస్వా ములమై భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందిద్దామని అక్కడున్న వారు చెప్పుకోవడం విశేషం.