ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు నీరు రైతుల పంటపొలాల్లోకి చేరుకుంటున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, అధికారులు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం వెట్న్ నిర్వహించగా, విజయవంతమైంది. ఎత్తిపోతల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్, ఈఈ రవీందర్, తదితర అధికారుల బృందం పూర్తిగా పర్యవేక్షించింది. ఇక రైతులకు ఈ యేడాది నుంచి 37, 500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నది. వెట్న్ల్రో భాగంగా ప్రాజెక్టు నీరు కాలువల్లో పరవళ్లు తొక్కడంతో రైతులు సంబురాల్లో మునిగి తేలారు. సర్కారు అందిస్తున్న సాగునీటితో తాము రెండు పంటలు సాగు చేస్తామని చెబుతున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని విస్మరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తూ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్ మండలం కొరాట వద్ద పెన్గంగ నదిపై చనాక- కొరాట ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. మన రాష్ట్రంలోని జైనథ్ మండలం కొరాట వద్ద నిర్మించే బరాజ్, ప్రధాన కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 451.46 కోట్లను మంజూరు చేసింది, పంప్హౌస్ నిర్మాణ పనులకు రూ.118.92 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. .పెన్గంగ ప్రాజెక్టుకు రాష్ట్రంలో నిర్మించే కాలువలకు మహారాష్ట్రకు రూ.1,227కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలో ఐదు మండలాల్లోని 89 గ్రామాల రైతులకు చెందిన 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
గత పాలకుల నిర్లక్ష్యం
జీవనది గోదావరికి ఉపనదిగా ఉన్న పెన్గంగపై ప్రాజెక్టు నిర్మించాలని 1975 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. నాలుగు బరాజ్లను నిర్మిస్తే 88 శాతం మహారాష్ట్ర, 12 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉంటుంది. పెన్గంగపై మహారాష్ట్రలోని 3 ప్రాజెక్టులు, మన రాష్ట్రంలోని చెనాక-కొరాట వద్ద మరో బరాజ్ను నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలో నిర్మించే ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటిని జిల్లాకు తీసుకువస్తారు. అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా జిల్లాలో 47,520 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెన్గంగ నీటిని నిల్వచేసి రైతుల భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని దాదాపు 40 ఏండ్లుగా రైతులు కోరినా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చింది. పెన్గంగ నీటిని కోరాట వద్ద 0.98 టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు బరాజ్ను నిర్మిస్తుండగా, పనులు పూర్తయ్యాయి. 23 ఫిల్లర్లు నిర్మించడంతో పాటు గేట్లు బిగింంచారు. రెండు అబట్మెంట్స్ నిర్మాణాలు పూర్తయ్యాయి. రిజర్వాయర్కు మహారాష్ట్ర వైపు గోడ నిర్మాణం పూర్తయింది. రైతుల భూములకు సాగునీరు అందించడానికి 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్ మెయిన్స్కు సంబంధించి 3 కిలోమీటర్ల పైపులు వేశారు.
వెట్న్ విజయవంతం
బరాజ్ నీటిని ఎత్తిపోసేందుకు పంప్హౌస్, విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించారు. పంప్హౌస్లో 5.5 మెగావాట్లు మూడు మోటర్లు, 12 మెగావాట్ల 3 మూడు మోటర్లను బిగించారు. పంప్హౌస్ నుంచి కాలువల్లో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసేందుకు మూడ్రోజుల కిందట డ్రైరన్ నిర్వహించిన అధికారులు రెండ్రోజులుగా వెట్న్ చేపట్టారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం వెట్న్న్రు విజయవంతంగా నిర్వహించారు. ఎత్తిపోతల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్, ఈఈ రవీందర్, డీఈ, ఏఈలు, ట్రాన్స్కో అధికారులు వెట్న్ నిర్వహణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైనందున నాలుగు మండలాల్లోని 37,500 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రన్లో భాగంగా ప్రాజెక్టు నీరు కాలువల్లో ప్రవహించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
రెండు పంటలకూ సాగునీరందిస్తాం
చనాక- కొరాట ప్రాజెక్టు వెట్న్ రెండు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. 5.5 మెగావాట్ల ఒక మోటర్తో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోస్తున్నాం. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం రైతుల సాగుభూములకు నీరందేలా చర్యలు తీసుకు న్నాం. డీ14, 15, 16 కాలువల ద్వారా రైతుల భూములకు సాగునీరు అందిస్తాం. ప్రాజెక్టు నీటితో రైతులు వానకాలం, యాసంగి పంటలు సాగుచేసుకోవచ్చు. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణంతో ప్రయోజనం చేకూరుతుంది. – శ్రీనివాస్, సీఈ, చనాక- కొరాట ప్రాజెక్టు