తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ నదిపై నిర్మిస్తున్న చనాక-కొరాట బరాజ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 0.98 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. 23 పిల్లర్లు నిర్మించడంతోపాటు గేట్లు బిగించారు. బరాజ్, ప్రధాన కాలువల నిర్మాణానికి రూ.451.46 కోట్లు, పంప్హౌస్ పనులకు రూ.118.92 కోట్లు, పెన్గంగ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర పరిధిలో నిర్మించే కాలువలకు రూ.1,227 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో గల 89 గ్రామ పంచాయతీల్లోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాగా.. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి సెప్టెంబర్ మాసంలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. బరాజ్ వల్ల భూగర్భ జల మట్టం పెరిగి రెండు పంటలు పండిస్తామని రైతులు, చేపలు పట్టుకొని ఉపాధి పొందుతామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ) : గోదావరికి ఉపనదిగా ఉన్న పెన్గంగపై ప్రాజెక్టు నిర్మించాలని 1975 సంవత్సరం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. నాలుగు బరాజ్లను నిర్మిస్తే 88 శాతం మహారాష్ట్ర, 12 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాలి. పెన్గంగపై మహారాష్ట్రలోని మూడు ప్రాజెక్టులు, తె లంగాణలోని చనాక-కొరాట వద్ద మరో బరా జ్ను నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలో నిర్మించే ప్రాజెక్టు కాలువల ద్వారా నీటిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తారు. అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా జిల్లాలో 47,520 ఎకరాలకు సాగునీ రు అందుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు గా పెన్గంగ నీటిని నిల్వ చేసి రైతుల భూములకు తరలించాలని కోరినా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావులు మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టా లు ఆమోదం తెలిపాయి. మన రాష్ట్రంలోని జై నథ్ మండలం కొరాట వద్ద నిర్మించే బరాజ్, ప్రధాన కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.451.46 కోట్లు మంజూరు చేసింది. పంప్హౌస్ నిర్మాణ పనులకు రూ.118.92 కోట్లు కేటాయించింది. పెన్గంగ ప్రాజెక్టుకు రాష్ట్రం లో నిర్మించే కాలువలకు మహారాష్ట్రకు రూ.1,227 కోట్లను ప్రభుత్వం కేటాయించిం ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో గల 89 గ్రామాల పరిధిలోని 51 వేల ఎకరాలను సాగునీరు అందనుంది.
బరాజ్ నిర్మాణం పూర్తి
పెన్గంగ నీటిని కొరాట గ్రామం వద్ద 0.98 టీ ఎంసీల నీటి నిల్వ చేసేందుకు బరాజ్ను నిర్మిస్తుండగా పనులు పూర్తయ్యాయి. 23 పిల్లర్లు నిర్మించడంతోపాటు గేట్లు బిగించారు. రెండు అబట్మెంట్స్ నిర్మాణాలు పూర్తయ్యాయి. రిజర్వాయర్కు మహారాష్ట్ర వైపు గోడ నిర్మాణం పూర్తయింది. కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. కరోనా కారణంగా మిగతా పనుల్లో జాప్యం జరిగింది. రైతుల భూములకు సాగునీరు అందించడానికి 47 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్ మెయిన్స్కు సంబంధించి 4 కిలోమీటర్లకు 3 కిలోమీటర్ల పైపులు వేశారు. పంప్హౌస్ పనులు పూర్తి కాగా.. నాలుగు మెటార్లు బిగించి, డెలివరీ పైప్స్ నిర్మాణం, సివిల్ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
సెప్టెంబరులో సాగు నీటి విడుదల
ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసి సెప్టెంబర్ మాసంలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వర్షాకాలంలో నది ప్రవా హం ఎక్కువగా ఉంటుంది. బరాజ్ పనులు పూర్తికావడంతో నీటిని నిల్వచేసి పంప్హౌస్ ద్వారా కాలువల్లో నీరు ఎత్తిపోయనున్నట్లు నీ టిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజె క్టు పనులు పూర్తి కావడంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల క ల నెరవేరుతోందని అంటున్నారు. ఇక నుంచి తాము రెండు పంటలు వేసుకొనే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో భూగర్భ జలనీటి మట్టం పెరిగి తాగునీటికి ఇబ్బందులు ఉండవు. మత్స్యకారులు చేపలు పెంచుకొని ఉపాధిని మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.