ఎదులాపురం/బేల, డిసెంబర్12: దేశంలోని యువకుల కోసం బీజేపీ ఏం చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. 500పైగా పరిశ్రమలను మూసివేసి ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేసిన చరిత్ర బీజేపీదేనని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిందన్నారు. దీంతో కొంత మంది సోయిలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ముఖ్యనాయకులు సీఎం కేసీఆర్ను కలవడానికి తీసుకెళ్లాలని కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదేళ్లలో 16 లక్షల ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.
బంగారుగూడ ఇంటి స్థలాల పట్టాల సమస్య ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. విడుతల వారీగా సమస్యలు పరిష్కరిస్తున్న సమయంలో బీజేపీ నాయకులు అక్కడ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయంలో జైనథ్, బేల, అదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ పట్టణా నికి చెందిన 30 మందికి రూ.12,90,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త మునేశ్వర్ ఏక్నాథ్ ఇటీవల ప్రమాదంలో మరణించగా, బాధిత కుటుంబానికి రూ.2లక్ష బీమా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబం యోగ క్షేమా లను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటా మని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, లైబ్రరీ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ గండ్రత్ రమేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు వెంకట్ రెడ్డి, చంద్రయ్య, సతీశ్ పవార్, స్వరూపా రాణి, బొడగం మమత, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఖోడే విపిన్, వాడ్కర్ తేజ్రావు,దేవన్న, బండి సుదర్శన్ పాల్గొన్నారు.