సీసీసీ నస్పూర్/ఆసిఫాబాద్, ఫిబ్రవరి 23: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, నస్పూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్యతో కలిసి లాస్యనందిత చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం దివాకర్రావు మాట్లాడుతూ చిన్న వయసులోనే లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఆమె మరణించడం బాధాకరమన్నారు.
ఈ సందర్భంగా లాస్యనందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కార్యదర్శి మేరుగు పవన్కుమార్, నాయకులు వంగ తిరుపతి, గోగుల రవీందర్రెడ్డి, గట్టు శ్రీనివాస్, పెరుమాళ్ల జనార్ధన్, మండల క్రాంతి, అమృత రాజ్కుమార్, మధూకర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 23 : ఎమ్మెల్సీ కవిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి సికింద్రాబాద్లోని లాస్య నందిత ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. నందిత ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కోవలక్ష్మి వారు తెలిపారు.