నార్నూర్, మే 6 : తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, ఆయన హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామంలో సోమవారం స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లోక్సభ ఎన్నికల్లో కాంగెస్క్రు ఓటేస్తే బతుకులు ఆగమేనని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఐదు నెలలు దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడేందుకు ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్నాయక్, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, రాథోడ్ సుభాష్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 6 : ఉట్నూర్ మండలం హస్నాపూర్లో జడ్పీటీసీ చారులత రాథోడ్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలకు నీళ్లు అందించి, బీఆర్ఎస్ కరపత్రాలు అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ అజయ్, ఎస్కే రవూఫ్, న్యాను, జాదవ్ సుభాష్, రాథోడ్ వామన్ పాల్గొన్నారు.
అలాగే లక్షటిపేట్, కామాయిపేట్, బాబాపూర్, చిన్నూగూడ, పాటగూడ, ముసల్పాడ్ గ్రామాల్లో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి, ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. అనంతరం బాబాపూర్ మాజీ సర్పంచ్ దేవ్రావు, మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, గ్రామ పటేల్ శివకుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు రషీద్, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు సింగారే భరత్, సీనియర్ నాయకుడు దావుల రమేశ్, మరప బాజీరావు, కేంద్రే రమేశ్, కాటం రమేశ్, సాయి కుమార్, చంద్రకాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, మే 6 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపునకు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మలుపుకావాలని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, బీఆర్ఎస్ మండల నాయకుడు ఏలాల చిన్నరెడ్డి అన్నారు. నిర్మల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. అంతకుముందు వారు వివిధ గ్రామాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుండంపల్లి గంగారెడ్డి, మాజీ సర్పంచ్లు విఠల్, జాన్ సత్య, బొల్ల ఆనందం, గోవిందుల మధు, హస్సేన్, రాథోడ్ అశోక్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి(తలమడుగు), మే 06 : తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ నాయకుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పండుగ వస్తే ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు వస్తాయని, ఆ రెండూ ఒకటేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు రాగి రాంకిషన్, అభిరాం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అబ్దుల్లా, మున్న, నారాయణ పాల్గొన్నారు.
భీంపూర్, మే 6 : భీంపూర్ మండలం కామట్వాడ, గోవింద్పూర్ తదితర గ్రామాల్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం ఖాయమని, భారీ మెజారిటీకి అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు అనిల్, జీ నరేందర్, మడావి లింబాజీ, ఎం కల్చాప్యాదవ్, మల్లెల స్వామి, గొల్లి లస్మన్న, బొంత నితిన్, అఫ్రోజ్, భోజన్న యాదవ్, ముకుంద సంతోష్ తదితరులున్నారు.
సారంగాపూర్, మే 6 : నిర్మల్లోని దివ్యగార్డెన్ సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బూత్లెవల్ కార్యకర్తల సమావేశానికి మండల నాయకులు తరలివెళ్లారు. వెళ్లిన వారిలో మాజీ సర్పంచ్లు దేవిశంకర్, జీవన్రావు, రైతుబంధు సమితి మాజీ మండల కో-ఆర్డినేటర్ ఇప్ప మధుకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాథోడ్ దత్తురాం, నాయకులు మల్లేశ్, రాంరెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, భోజన్న, శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.