హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిం చి దిశా నిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే పురాణం సతీశ్కుమార్ పాల్గొన్నారు.