కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్నగర్లో నిర్వహించనుంది. సిర్పూర్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగురామన్న, ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే బీఎస్పీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరనున్నారు.
కాగజ్నగర్లోని సంతోష్ ఫంక్షన్ హాల్లో సుమారు 3 వేల మంది పార్టీ కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇటీవల బీఆర్ఎస్లో చేరిన తరువాత నియోజకవర్గంలో రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాగజ్నగర్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అనుగుణంగా భోజన వసతి కల్పించనున్నారు. సమాశాన్ని విజయవంతం చేసేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
కాగజ్నగర్లో నిర్వహించనున్న సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమాశాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి. సుమారు 3 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. గ్రామస్తాయి నుంచి కార్యకర్తలు పాల్గొంటారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం.
-దండె విఠల్, ఎమ్మెల్సీ, సమన్వయ కర్త