కాసిపేట, ఏప్రిల్ 29 : అధికారం, పదవుల కోసం పాకులాడే గడ్డం ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాసిపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి విస్త్రత ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. గులాబీ దండుతో ర్యాలీగా వచ్చిన కొప్పుల ఈశ్వర్ ప్రధాన చౌరస్తాలో మాట్లాడారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెబుతారా అని ప్రజలను ప్రశ్నించగా, వారు ఓటుతో గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇక్కడి రిజర్వేషన్లను గడ్డం కుటుంబమే అభవిస్తున్నదని, అన్ని పదవులు వాళ్లకే దక్కాలా అని అన్నారు. కార్పొరేట్ వ్యాపారిని తీసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, పొరపాటున ఆయనను గెలిపిస్తే మళ్లీ కనిపించడని, ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోడన్నారు. అధికారం కోసం గడ్డం వివేక్, గడ్డం వినోద్లు ఎన్ని పార్టీలు మారారో ప్రజలకు తెలుసన్నారు. కార్పొరేట్ వ్యాపారస్తులకు ప్రజల కష్టాలు తెలియవని, అన్ని వర్గాలకు అండగా నిలిచే బీఆర్ఎస్నే గెలిపించాలని ఆయన కోరారు.
గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్క రో జూ బెల్లంపల్లిలో లేడని, ఎప్పుడూ క్యాంప్ ఆఫీస్కు తాళం వేసి ఉంటుందని, ఆయన కోసం ప్రజలు హై దరాబాద్ వెళ్లాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజార్టీతో పట్టం కట్టాలని కోరారు.
జడ్పీటీసీ చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, చంద్రమౌళి, ఉప సర్పంచ్లు బోయిని తిరుపతి, అ శోక్, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాస్దేవ్, టౌన్ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, భీమయ్య, మంజులారెడ్డి, జాడి రాంచందర్, బుగ్గ రాజన్న, దుర్గం సాగర్, లంక లక్ష్మణ్, ఖరీం, రాజేశం, శ్రావణ్, నవీన్ పాల్గొన్నారు.
తాండూర్, ఏప్రిల్ 29 : బూటకపు హామీలతో నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ను అసలే నమ్మొద్దని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈ శ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బా ల్క సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం రాత్రి తాండూర్ మండల కేంద్రం ఐబీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ఇ చ్చిన హామీలు అమలు కావాలంటే ఈ పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్కు అవకాశమివ్వాలన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం వివేక్ కుటుంబ గుత్తాధిపత్యమా? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, కాంగ్రెస్ పార్టీలో వేరే దళితులే లేరా అని ప్రశ్నించారు. దేశంలో గొప్ప గొప్ప పదవులు అనుభవించిన దళిత నాయకులెవ్వరూ కూడా సంపాదించని వేల కోట్లు వివేక్ కు టుంబ సభ్యులు ఎలా సంపాదించారో ప్రజలు అ ర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు తొలగించడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్జీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్, బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి గంట రాములు యాద వ్, ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, పీఏసీఎస్ చైర్మన్, బీఆర్ఎఎస్ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, పార్టీ కోశాధికారి రాంచందర్, వైస్ ఎంపీపీ నారాయణ, ఎంపీటీసీ మొగిలి శంకర్, నాయకులు దత్తాత్రేయరావు, మంగపతి సురేశ్బాబు, రాజేశ్, రాంచందర్, బోడ సతీశ్, గౌస్, జావేద్, అబుసాదు, మత్స్యకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నయ్య పాల్గొన్నారు.