చెన్నూర్, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ పార్టీ పె ద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈ శ్వర్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భం గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పిలుపు మేరకు జిల్లా నుంచి నాయకులు పెద్ద సంఖ్య లో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అబద్ధపు హామీలు, మోసాలను గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వారిలో చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రెవెల్లి మ హేశ్, తుమ్మ రమేశ్, సుధాకర్, మాజీ స ర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు రాంలాల్ గిల్డా, మేడ సురేశ్రెడ్డి, నాయిని సతీశ్, లక్ష్మణ్, నెన్నల భీమయ్య ఉన్నారు.
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 19 : చెన్నూర్ మండలం కిష్టంపేట, ఆస్నాద్, కొమ్మెర, నా గాపూర్, ముత్తరావుపలి గ్రామాల నుంచి నా యకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. వారిలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ తిరుపతి, నాయకులు రత్న సమ్మిరెడ్డి, అయిత సురేశ్ రెడ్డి, బుర్ర రాకేశ్ తదితరులు పాల్గొన్నారు..
కోటపల్లి, ఏప్రిల్ 19 : కోటపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెబుతారని వారు పేర్కొన్నారు.
జైపూర్, ఏప్రిల్ 19 : జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు మండల ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి తెలిపారు. తరలిన వారిలో వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, సీనియర్ నాయకులు మేడి తిరుపతి, ఆర్నె సమ్మయ్య, వెంకాగౌడ్, పూదరి మల్లేశ్ తదితరులున్నారు.
మందమర్రి, ఏప్రిల్ 19 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్, యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో పెద్దపల్లికి తరలివెళ్లారు. అంతకుముం దు స్థానిక మార్కెట్ ఏరియాలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకు లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు.
తరలిన వారిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు జే రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, ఓ రాజశేఖర్, ఎండీ అబ్బాస్, కొంగల తిరుపతి రెడ్డి, బండారు సూరిబాబు, మద్ది శంకర్, బర్ల సదానందం, ఈశ్వర్, కనకం రవీందర్, చేపూరి లక్ష్మణ్, సోషల్ మీడియా ఇన్చార్జిలు సీపెల్లి సాగర్, విరుగురాల వికాస్, బెల్లం అశోక్, మహిళా నాయకులు ఎర్ర రజిత, చిప్పకుర్తి రేఖ, స్వరూప, జరీనా, సుజాత, లలిత, సందుపట్ల సుజాత, రమాదేవి, సైరాబాను, కల్పన, శారద, సులోచన తదితరులున్నారు.
దండేపల్లి, ఏప్రిల్ 19 : దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. తరలిన వారిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
శ్రీరాంపూర్, ఏప్రిల్ 19 : శ్రీరాంపూర్ ఏరియా నుంచి టీబీజీకేఎస్, నాయకులు, కార్యకర్తలు తలివెల్లారు. శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, పెట్టం లక్షణ్, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, పుప్పాల సంపత్, తొంగల రమేశ్, అన్వేష్రెడ్డి, సాదుల భాస్కర్, పొగాకు రమేశ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సాయి తదితరులు వెళ్లారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 19 : క్యాతనపల్లి మున్సిపాలిటీ నుంచిబీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, సీనియర్ నాయకుడు రాజారమేశ్బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. 300 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత వెళ్లారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు జాడీ శ్రీనివాస్, పోగుల మల్లయ్య, గడ్డం సంపత్ కుమార్, పార్వతి విజయ, బైరమల్ల మెగిలయ్య, రామిడి కుమార్, గోపు రాజం, నందిపేట సదానందం, గడ్డం రాజు, రేణుకుంట్ల పోచయ్య, చంద్రకిరణ్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.