కాగజ్నగర్, మార్చి 28 : సిర్పూర్ నియోజకవర్గంలో కొనసాగిస్తున్న అక్రమ దందాలు కాపాడుకోవడానికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరాడని బీఆర్ఎస్ నా యకుడు, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెం ట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ని యోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో చర్చలు జరుపుతున్న తరుణంలోనే తన స్వార్థం కో సం కాంగ్రెస్ పార్టీలో చేరాడన్నారు. అక్రమ బియ్యం, మట్కా, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి దోచుకోవడానికి అధికార పార్టీ లో చేరాడని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బహుజన వాదాన్ని కా పాడుకోవడానికే కారెక్కానని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో లక్షల మంది విద్యార్థులు మెరుగైన విద్య పొందుతున్నారని కొనియాడారు.
సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు అనతికాలంలోనే అక్కున చేర్చుకొని శాసనసభ ఎ న్నికల్లో 44వేల ఓట్లు వేశారని, నా కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, వారికి పాదాభివందనా లు చేస్తున్నానన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజన బిడ్డ ఆత్రం సక్కు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులు సోయం చిన్నయ్య, ఆయా మండలాల ప్రజలకు, సీఐటీయూ నాయకుడు అంబాల ఓదెలుకు బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు.
పదేళ్లలో ఎంతో అభివృద్ధి..
– ఎమ్మెల్యే కోవ లక్ష్మి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆసిఫాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన జిల్లాలో మెడికల్ కాలేజీ, మైనార్టీ, జ్యోతిబాపూలే గురుకులాలు, రోడ్లు, వంతెనలు, గూడెం వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మించుకున్నామన్నారు. అంతేగాకుండ వార్ధా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు గడిచినా ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
కాగజ్నగర్లో మూతపడ్డ పేపర్ మిల్లును తెరిపించిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీకి తెగబడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బహుజన వాదం పార్టీ అని, ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజనుల కోసం పోరాడడం గొప్ప విషయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తనకు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అండగా ఉన్నారని, తన గెలుపు ఖాయమని, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, బెజ్జూర్ జడ్పీటీసీ పుష్పలత, నాయకులు రాజ్కుమార్, మోయిన్, లెండుగూరె శ్యాంరావు, మిన్హాజ్, బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.