జైపూర్, ఫిబ్రవరి 11: ఈ నెల 6న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అవమానించిన అగ్ర వర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళిత నాయకుడైన బాల్క సుమన్ను కులం పేరుతో దూషిస్తూ చిత్రపటానికి చెప్పుల దండ వేశారంటూ తమ వద్ద ఉన్న ఆధారాలతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు మేడి తిరుపతి, రాజేశ్, స్వామి ఉన్నారు.