“మంచిర్యాల జిల్లా చాలా చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడి నా అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. దివాకరన్న అడిగిన ఐటీ హబ్ కావాల్నా.. లేకపోతే పేకాట క్లబ్ కావాల్నా.. రైతుబంధు కావాల్నా.. రాబంధులు కావాల్నా.. ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి..” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. స్కీమ్లు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండని, స్కామ్లు కావాలంటే ఆ సన్నాసి కాంగ్రెస్కు ఓటు వేయండన్నారు. రైతుబంధు కావాలంటే దివాక రన్నకు ఓటు వేయండి.. కాదనుకుంటే ఆ రాబంధులకు ఓటు వేయండని తెలిపారు. ఇందులో సిగ్గుపడే ముచ్చట ఏం లేదని.. మంచిర్యాలను ముంచేద్దామా.. ఎవ్వల చేతుల్లో పెడితే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాలన్నారు. సింగరేణిలో ప్రతి హామీని నెరవేర్చిం ది.. రెవెన్యూ డివిజన్గా ఉన్న మంచిర్యాలను జిల్లా చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఆలోచించాలన్నారు. దివాకరన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐటీ హబ్ ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
– మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ వచ్చాక కారుణ్య నియామకాలు, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమా కాదా.. కారుణ్య నియామకాల వయస్సు 40 ఏండ్ల దాక పెంచాలని అడుగుతున్నారు. డిసెంబర్ 3వ తేదీన దివాకరన్నను గెలిపించండి.. తప్పకుండా ఆ పని చేసి చూపిస్తా.
మంచిర్యాలకు ఒక డిగ్రీ కాలేజీ కావాలంటే, జూనియర్ కాలేజీ కావాలంటే ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రోజులు మర్చిపోవద్దు. 55 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ పాలనలో డిగ్రీ కాలేజీ రాలేదు, జూనియర్ కాలేజీ రాలేదు. అట్లాంటి మంచిర్యాలకు ఇవాళ మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ కాదా.. మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెసోళ్లు ఓట్లు అడుగుతున్నరో చెప్పాలి.
మన ఇంట్లో పెండ్లీడుకు వచ్చిన ఆడపిల్లకు పెండ్లి చేయాలంటే ఎంత ఆలోచన చేస్తాం. ఇయ్యబోయే పిల్లగాడు లంగా, దొంగా.. సిగరేట్ తాగుతడా.. మందు కొడుతడా.. పత్తాలు ఆడుతడా.. అని చూస్తం.. మరీ మంచిర్యాలను ఎవరి చేతుల్లో పెడుతున్నమో ఆలోచించాలి. జాగ్రత్తగా, తొందర పడకుండా ఓటు వేయాలి.
దివాకరన్న మీద గులిగినా, అలిగినా.. గులుగుడు గులుగుడే.. మళ్లా ఓట్లు గుద్దుడు గుద్దుడే ఉండాలి. మనోళ్లను గెలిపించుకోవాలే తప్పా.. మన జుట్టు ఢిల్లీ పార్టీల చేతిలో పెట్టొద్దు.మంచిగా ఉన్న మంచిర్యాలను కాపాడుకోవాలే తప్పా, ఆగం చేసుకోవద్దు.
మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలోని అక్కలు, అన్నలు, త మ్ముళ్లు, చెల్లెళ్లు మీకు ఐటీ హబ్ కావాల్నా.. పేకాట క్లబ్ కావాల్నా.. తేల్చుకోండి.. అని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఐటీ హబ్ కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి. పేకాట క్లాబ్ కావాలంటే మీ ఇష్టమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివాకరన్న అడిగిన ఐటీ హబ్ కావాల్నా.. లేక పేకాట క్లాబ్ కావాల్నా.. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా.. ఆలోచించాలన్నారు.
స్కీమ్లు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండని, స్కామ్లు కావాలంటే ఆ సన్నాసి కాంగ్రెస్కు ఓటు వేయండన్నారు. రైతుబంధు కావాలంటే దివాకరన్నకు ఓటు వేయండి.. కాదనుకుంటే ఆ రాబంధులకు ఓటు వేయండన్నారు. ఇందులో సిగ్గుపడే ముచ్చట ఏం లేదని కారు కావాల్నా.. బే కారు గాళ్లు కావాల్నా.. మంచిర్యాలను ముంచేద్ద మా.. ఎవ్వల చేతుల్లో పడితే వాళ్ల చేతుల్లో పెడుదా మా.. ఆలోచించుకోవాలన్నారు. ఇందాక దివాకరన్న మాట్లాడుతూ.. బాగా ఆవేశపడ్డారన్నారు. గం త ఆవేశపడే పరిస్థితి ఏం లేదని, మీరు పక్కా గెలుస్తున్నరని చెప్పారు. మంచిర్యాల ప్రజలు మంచిని, మంచివాళ్లను కోరుకుంటారని, లంగలను దొంగలను నమ్మరని మీరేం భయపడొద్దన్నారు.
తెలంగాణ వచ్చిన తొమ్మిదిన్నరేండ్లలో మంచిర్యాలలో జరిగిన మార్పులు మీ కండ్ల ముందే కనబడుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఉన్నప్పుడు 2014 దాకా మీరు 40 ఏండ్లు తండ్లాడినా ఎన్నడూ పట్టించుకోలేదు. ఏ కాంగ్రెస్ నాయకుడు ఆనాడు మంచిర్యాల కోసం కనీస ఆ లోచన కూడా చేయలేదన్నారు. రెవెన్యూ డివిజన్గా ఉన్న మంచిర్యాలను ఇవాళ జిల్లా చేసిన నాయకు డు మన ముఖ్యమంత్రి కేసీఆరా.. కాదా.. ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఆనాడు మంచిర్యాలలో ఒక రైతుకు సమస్య ఉండి కలెక్టర్ను కలవాలంటే.. ఆదిలాబాద్కు పోవాల్సి వస్తుండేనన్నారు. వందల కి లోమీటర్లు జంగల్ మీద నుంచి ఆదిలాబాద్ పో యేందుకు ఎన్ని అవస్థలు పడ్డామో గుర్తు చేసుకోమన్నారు.
ఇవాళ మంచిర్యాలలో దివాకర్రావును గెలిపించుకొని, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకున్నాక.. మంచిర్యాలలోనే అద్భుతమైన కలెక్టరేట్ను జిల్లా అధికారులను తెచ్చుకున్నామన్నారు. అప్పు డు ఎట్లుండే మంచిర్యాల.. ఇప్పుడు ఎైట్లెందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఆ నాడు అరవిందరెడ్డి నాయకత్వంలో మంచిర్యాలలో ఉద్యమం జరిగినప్పుడు చాలా సార్లు వచ్చానని, ఆ రోజు ఆయన ఇంటి ఎదుట చూసిన అదే గల్లీ ఇవాళ ఎట్లా అయ్యిందో చూడాలన్నారు. ఇదే మెయిన్ రోడ్డు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంటే, ఇవాళ ఎైట్లెంది మీ కండ్లతోని చూసి, మనసుతో ఆలోచించాలన్నారు. మంచిర్యాల జిల్లా అవ్వడంతోపాటు అన్ని హంగులు సంపాదించుకొని బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకుపోతున్నదన్నారు.
మంచిర్యాల సింగరేణి మీద ఆధారపడిన పట్టణమని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి కార్మికుల చెమట, రక్తంతో నడిచే పట్టణం ఇది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే సింగరేణి కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32 శాతం బోనస్ ఇచ్చామన్నారు. దీపావళి, దసరాకు రూ.1000 కోట్ల బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరన్న ఉన్నరా.. ఆలోచించాలన్నారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలపై అం దరూ మాటలు చెప్పినోళ్లే తప్ప, నిలుపుకున్నోళ్లు ఎవరూ లేరన్నారు.
కేసీఆర్ వచ్చాక కారుణ్య నియామకాలు, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమా కాదా.. ఆలోచించాలన్నారు. కారుణ్యనియామకాలకు వయస్సు 40 ఏండ్ల దాక పెంచాలని అ డుతున్నారని, డిసెంబర్ 3వ తేదీన దివాకర్అన్న ను గెలిపించండి తప్పకుండా ఆ పని చేసి చూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన రోజు సిం గరేణి కార్మికులకు పది హామీలు ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారని మరి అలాంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలా.. వద్దా… మీరే నిర్ణయించాలన్నారు. 2014లో ఇదే మంచిర్యాలలో ప్రతి షాప్కో ఇన్వర్టర్, జనరేటర్ లేకుండేనా.. ఒకసారి యాద్ చేసుకోవాలన్నారు. ఆనాడు క రెంట్ కష్టాలు ఎట్లా ఉండేనో గుర్తు తెచ్చుకోవాలన్నారు.
ఏదన్న ఊరిలో పెద్ద మనిషి సచ్చిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసి మా పెద్దమనిషి సచ్చిపోయిండు. బాయి కాడికి పోయి స్నానం చేయాలే. కరెంట్ లేదు. ఒక 20 నిమిషాలు కరెంట్ ఇవ్వండని దండం పెడతామని అని బతిలాడుకున్నది వాస్తవమైతే కాంగ్రెస్ పార్టీకి సిగ్గు వచ్చేటట్లు చేయాలన్నారు. ఇక్కడున్న గోదావరి కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉండేనో యాది తెచ్చుకోవాలన్నారు. ఇవాళ దివాకర్రావు కరకట్టలు కావాలి అనేంతగా దాన్ని బాగు చేసుకన్నామన్నారు. ఆనాడు కాంగ్రెసోళ్లు గోదావరిని ఎండబెడితే ఇవాళ గోదావరి నిండుగా పారేట్లు చేసింది కేసీఆర్ కాదా.. ఆ నాడు రామగుండం-మంచిర్యాలను కలిపే బ్రిడ్జిపై నుంచి గోదావరిలో ఒక పైసా వేయాలంటే నీళ్లు ఏడున్నయ్ అని దేవులాడాల్సి వస్తుండేని, ఇవాళ సముద్రంలా గోదావరి ఉన్న మాట వాస్తవం కాదా.. ఇవన్ని మీ కండ్ల ముందు లేవా.. చూడాలన్నారు.
మంచిర్యాలకు ఒక డిగ్రీ కాలేజీ కావాలంటే, జూనియర్ కాలేజీ కావాలంటే ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రోజులు మర్చిపోవొద్దని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 55 ఏండ్ల దరిద్రపు కాంగ్రెస్ పాలనలో డిగ్రీ కాలేజీ రాలేదు, జూనియర్ కాలేజీ రాలేదన్నారు. అట్లాంటి మంచిర్యాలకు ఇవాళ మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ కాదా.. మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెసోళ్లు ఓట్లు అడుగుతున్నరో చెప్పాలన్నారు. కరెంట్, తాగునీరు, సాగునీరు సక్కగ ఇయ్యలే. ఒక్క కాలేజీ తేలే.. పట్టణం బాగు చేయలే.. పల్లెలు బాగు చేయలే.. ఏదీ కూడా బాగా చేయని దరిద్రులు మళ్లీ వచ్చి ఇవాళ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నరని, నోటికి వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు.
మన ఇంట్లో ఒక పెండ్లీడుకు వచ్చిన ఆడపిల్లకు పెండ్లి చేయాలంటే ఎంత ఆలోచన చేస్తాం. ఇయ్యబోయే పిల్లగానికి ఏమన్న లంగ, దొంగ లక్షణాలు ఉన్నయా? వాడు సిగరేట్ తాగుతడా లేక మందు కొడుతడా.. పత్తాలు ఆడుతడా.. ఇవ్వన్ని చూస్తమా చూడమా.. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వానికేమన్న లంగ అలవాట్లు ఉంటే పిల్లను ఇస్తమా.. ఇవ్వం గదా.. మరి ఒక ఇంట్ల అమ్మాయి పెండ్లి చేసేప్పుడు గంత ఆలోచించే మనం.. మంచిర్యాలను ఎవరి చేతుల్లో పెడుతమో ఆలోచించొద్దా.. ఎవ్వరికి పడితే వాళ్లకు ఓటేసి తర్వాత తన్నించుకుందామా.. ఆలోచించాలన్నారు. జాగ్రత్తగా ఆలోచించి తొందరపడకుండా ఓట్లు వేయాలన్నారు.
దివాకర్రావు మొన్న గట్ల పోతుంటే నేను నమ స్తే పెట్టిన.. నాకు ఆయన నమస్తే పెట్టలేదని, దివాకరన్న నేను లగ్గానికి పిలిస్తే రాలేదని, పక్కింటోని దళితబంధు ఇచ్చిండు నాకు ఇయ్యలేదని, కొంతమందికే రేషన్ కార్డు వచ్చింది నాకు రాలేదని.. ఇ సోంటి గులుగుడు, అలుగుడు అక్కడక్కడ ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక ఊళ్లకు పోతే 500 మందికి పింఛన్లు వస్తుంటాయ్, రానోళ్లు ఓ 20 మంది ఉంటరు.. ఈ 500 మందేమో మంచిగ కడుపులో సల్ల కదలకుండా కూసుంటరు. ఈ ఇరవై మంది లొల్లి పెడుతుంటరు. నాకు పింఛన్ రాకపో యే.. పింఛన్ వస్తలేదని.. వాళ్లు చేసే లొల్లి చూసేటోళ్లకు ఏట్లనిపిస్తదంటే ఎవ్వనికి వస్తలేదా.. ఈ ఊళ్లో పింఛన్ అనిపిస్తదని, కానీ.. వాస్తవానికి వేరే ఉంటుందన్నారు. నేను మిమ్ములందరినీ కోరేది ఒ క్కటేనని అలిగినా, గులిగినా, నారాజైనా మనోళ్లతో నే పని చేయించుకోవాలన్నారు. మంచిర్యాలలో జోరుగా బిల్డింగ్లు, షాపులు కట్టారని మరి రేపటి రోజున అడ్డమైనోళ్లను ఓట్లు వేస్తే ఒక్కొక్క షాప్ మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. మంచిర్యాల లో అట్లాంటి దుర్మార్గులను గెలిపించవచ్చునా.. అ లాంటి వారి గురించి ఆలోచించవచ్చునా.. ఆలోచించాలన్నారు.
రెండు టర్మ్లు కేసీఆర్ బాగానే చే శారు, కల్యాణలక్ష్మీ-షాదీ ముబారక్ ఇచ్చారు, కేసీఆర్ కిట్లు ఇచ్చారు, మంచిర్యాలకు మెడికల్ కాలేజీ ఇచ్చారు, 30 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు, గోదావరిని బ్రహ్మాండంగా చేశారు, మంచిర్యాలను జిల్లా చేశారు, ఇవన్ని బాగానే ఉన్నయ్ కానీ రేపు ఏం ఇస్తారనుకునేటోళ్లు, ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు జా గ్రత్తగా ఈ విషయం వినాలన్నారు. డిసెంబర్ 3 త రువాత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అ య్యాక, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు గెలిచాక.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.3వేల సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నా రు. ఆసరా పింఛన్లను రూ.5వేలకు పెంచబోతున్నామన్నారు. రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16 వేలు చేసుకోబోతున్నామన్నారు. నరేంద్ర మోదీ రూ.400 సిలిండర్ను రూ.1200 చేశారని, ఈ సారి గెలిస్తే తప్పకుండా ఆ పెంచిన రూ. 800ను రాష్ట్ర ప్రభుత్వం భరించి రూ.400కే సిలిండర్ ఇస్తుందన్నారు. తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒ క్కరికీ దొడ్డు బియ్యం బదులు, సన్న బియ్యం ఇస్తామన్నారు. రైతుబీమా లేక్కనే కేసీఆర్ బీమా తీసుకువస్తున్నామని చెప్పారు. నిజంగా మీకు ఐటీ హబ్ కావాలంటే దివాకరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
మంచిని ఆశీర్వదించాలని, పనిచేసే నాయకులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అందరి మీద ఉన్నట్లే దివాకరన్న మీద గులుగుడు, అలుగుడు ఉంటాయన్నారు. ఎప్పటికైనా మనోడు మనోడే అయితాడన్నారు. మన పార్టీ మన పార్టీ అయితదని, ఢిల్లీ వాడు మనోడు ఎన్నటికీ కాడన్నారు. దివాకరన్న మీద గులిగినా, అలిగినా.. గు లుగుడు గులుగుడే.. మళ్ల గుద్దుడు గుద్దుడే అ న్నారు. మనోళ్లను గెలిపించుకోవాలే తప్ప మన జు ట్టు ఎవ్వడో హౌలా గానీ చేతిలో, ఢిల్లీ పార్టీల చేతి లో పెట్టొదన్నారు. మంచిగా ఉన్న మంచిర్యాలను కాపాడుకోవాలే తప్ప, ఆగం కావొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకా ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్రావు, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మున్సిపాల్టీల చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, కాంతయ్య, యూత్ నాయకుడు విజిత్రావు పాల్గొన్నారు.