మంచిర్యాల, జూన్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడం ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. మొదట మంచిర్యాల బై పాస్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విప్ సుమన్ మాట్లాడుతూ ఎన్నో పో రాట ఘట్టాలు, ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ ఉద్య మం నిదర్శనంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం మొదలుకొని, నేటి సచివాలయం వర కు ఎన్నో ప్రాజెక్టులు, ఆకాశహర్మ్యాలు, అధునాతన కట్టడాలు, చరిత్రాత్మక ని ర్మాణాలు తెలంగాణ ప్రగతి శిఖరాలుగా అబ్బురపరుస్తున్నాయన్నారు.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ సంక్షేమ రాజ్యం గా తీర్చిదిద్దారన్నారు. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలనతో ‘తెలంగాణ మోడల్’ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నదని, తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆచరిస్తున్నాయంటే అవి ఎంత ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇలా అనేక అభివృద్ధి, సం క్షేమ పథకాలతో ప్రజారంజక పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ప్రగతిపై రంగాల వారీగా ప్రభుత్వ విప్ సుమన్ వివరించారు.
వ్యవసాయం.. అనుబంధ రంగాలు.. .
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పథకాలు తీ సుకురావడంతో పాటు సుమారు రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మారెటింగ్ శాఖ ఆధ్వర్యం లో పంట ఉత్పత్తులు నిల్వ ఉంచేందుకు రూ. 37.50 కోట్లతో మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, జన్నారం, బెల్లంపల్లిలో గోదాములు నిర్మించారు.
నీటిపారుదల..
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కడెం ఆయకట్టు కింద, గూడెం ఎత్తపోతల పథకం, చెరువుల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. దీనికి తోడు 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.90 కోట్లతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే పర్ధాన్పల్లి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 1,658 కోట్ల రూపాయలతో లక్ష ఎకరాలకు నీరు అందించే మహత్తర ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వార్ధా నది మీద నిర్మించే ప్రాజెక్టు నుంచి 55 వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
పల్లె ప్రగతి..పట్టణ ప్రగతి..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను వినూత్నమైన సంసరణలతో ప్రజల ముంగిట నిలిపింది. పంచాయతీ శాఖ పరిధిలో 548 పల్లె ప్రకృతి వనాలు, 65 బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు 464 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగినది. పల్లెప్రగతిలో భాగంగా గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన డంప్యార్డు, వైకుంఠధామాలు, నర్సరీలను పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
మిషన్ భగీరథ..
రూ. 333 కోట్లతో 563 ట్యాంకులు, 2,625 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్లు నిర్మించింది. జిల్లాలో 667 ఆవాసాలకు 1,78,477 ఇండ్లకు, మన ఊరు- మన బడి పాఠశాలలకు, రైతు వేదికలకు నల్లా కనెక్షన్లు – ఇవ్వడంతో పాటు వైకుంఠధామాలలో బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నది. రూ.40 కోట్లతో చేస్తున్న మందమర్రి అర్బన్ భగీరథ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి.
మహిళలకు వరం..
మహిళలు కుటుంబంలో సుస్థిరమైన ఆదాయ అభివృద్ధి సాధించడం కోసం బ్యాంక్ లింకేజీ ద్వా రా 2014 నుంచి ఇప్పటి వరకు 9,651 స్వయం సహాయక సంఘాల్లోని 1,06,161 మంది సభ్యులకు రూ.1,604.44 కోట్ల రుణాలు మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.33.6 కోట్ల వడ్డీ రుణాలు మంజూరు చేశారు.
పరిశ్రమలు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా టీఎస్ ఐ-పాస్ ద్వారా 916 అనుమతుల కోసం దరఖాస్తులు రాగా, 765 అనుమతులు వివిధ శాఖల ద్వారా మంజూరు చేశారు. రూ.6,219 కోట్ల రూపాయలతో 448 పరిశ్రమలు స్థాపించడం ద్వారా 4,984 మందికి ఉపాధి కల్పించనున్నారు. టీ-ప్రైడ్ పథకం కింద 1,416 దరఖాస్తులకు రూ.58.35 కోట్లు రాయితీ మంజూరు చేశారు.
రాష్ట్రమంతటా విద్యుత్..
సింగరేణి సంస్థలోని బొగ్గు బావులు, ఉపరితల గనుల ద్వారా రాష్ట్రమంతటా విద్యుత్ సరఫరా చేసున్నాం. జైపూర్లో ఏర్పాటు చేసిన 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు అదనంగా 10 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/ 11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకుంటున్నాం.
ఇళ్ల పట్టాల పంపిణీ..
బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్ మండలాల్లో సింగరేణి స్థలాల్లో ఇండ్లు, వ్యాపారాలు పెట్టుకున్న 10,841 మందికి పట్టాలు పంపిణీ చేశాం. కార్మికులకు 29 శాతం ఇంక్రిమెంట్లు, సుమారు 18 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ సెలవులు, కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెం ట్, ఇల్లు కట్టుకునే వారికి రూ. 10 లక్షల వడ్డీ లేని రు ణాలు, ఉచితంగా విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, సింగరేణి క్వార్టర్లు అందించడంతో పాటు విధుల్లో చనిపోయిన కార్మికుడికి రూ. 20 ల క్షల ఎక్స్ గ్రేషియా, సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు, దసరా, దీపావళి పం డుగ అడ్వాన్సులు అందించడం జరుగుతున్నది.
రహదారులు-భవనములు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రూ.1,025 కోట్లతో 512 కిలోమీటర్ల రహదారులు, 67 వంతెనలు, 3 ఆర్వోబీలు నిర్మించుకున్నాం. ప్రజలకు పౌరసేవలన్నీ ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల భవనాన్ని సీఎం కేసీఆర్తో ప్రారంభించుకోనున్నాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నాబార్డు పథకం కింద రూ.8కోట్లతో 6 వంతెనలు నిర్మించుకున్నాం. రూ.30 కోట్లతో 164 గ్రామపంచాయతీ భవనములు మంజూరు కాగా , పనులు పురోగతిలో ఉన్నాయి. డీఎంఎఫ్టీ కింద రూ.35.69 కోట్లతో 556 సీసీరోడ్లు పనులు పూర్తి చేశాం.
ఎన్నెన్నో పనులు..
మన ఊరు – మన బడి పథకం కింద జిల్లాలో 248 పాఠశాలలను బాగుచేసుకున్నాం. చెన్నూర్ నియోజకవర్గంలోని 100 గ్రామపంచాయతీల్లో రూ.4 కోట్లతో 100 కేసీఆర్ గ్రంథాలయాలను నిర్మించనున్నాం. వైద్యవ్యవస్థను బలోపేతం చేసుకున్నాం. కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల ద్వారా 33 వేల మంది లబ్ధిదారులకు రూ.298.64 కోట్లు ఇచ్చాం. 99,334 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. జిల్లాలో 26,856 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు అందించాం. దళితబంధు పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు అందజేయాలని నిర్ణయించాం. జిల్లాలో ఇప్పటికే 313 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఐదుగురికి 9 ఎకరాలు, చెన్నూర్ నియోజకవర్గంలో 675 మందికి 1,200 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,396 మందికి 3,311 ఎకరాలు, జన్నారం మండలంలో 300 మందికి 487 ఎకరాలు పంపిణీ చేయనున్నాం. జిల్లాలో రూ.137 కోట్లతో 2,616 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుకాగా, ఇందులో 1,046 ఇళ్లు నిర్మించాం. గూడెం సత్యనారాయణస్వామి, వేలాల రాజరాజేశ్వరస్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల్ అభయారణ్యం, గాంధారిఖిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరుచనున్నాం. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.