నేరడిగొండ, జనవరి 11 : తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు భేష్ అని కొనియాడారు. అనంతరం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, మండల కన్వినర్ అల్లూరి శివారెడ్డి, సీనియర్ నాయకులు చంద్రశేఖర్యాదవ్, నారాయణ, నాగమల్యా ల్ సర్పంచ్ భీముడు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్ర హ్మానంద్ అందజేశారు. మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన దుర్గం సుగుణకు రూ.32 వేలు, తోషం గ్రామానికి చెందిన షేక్ ఖాజా బీకి రూ.44 వేలు మంజూరయ్యాయి. వాటిని బ్రహ్మనంద్ బాధితులకు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మం డల నాయకులు జాదవ్ రమేశ్, ఫడ్ దిలీప్, రావణ్ ముండె, సలీం ఖాన్, మాధవ్ కెంద్రే, ప్రశాంత్, త్రిశూల్, కార్యకర్తలు పాల్గొన్నారు.