ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం చేశారు.
కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను ఉట్నూర్లో బీఆర్ఎస్లో నాయకులు సన్మానించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. బోథ్ నియోజవకర్గానికి చెందిన పలువురు నాయకులు నేరడిగొండలో అభ్యర్థి అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు. నార్నూర్లో ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి ప్రచారం చేశారు. మండల కేంద్రంలో అందరినీ కలుస్తూ తనను గెలిపించాలని కోరారు.