లక్షెట్టిపేట, మార్చి 31 : బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్ణణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గడప గడపకూ వెళ్లి వివరించాలని సూచించారు. గత ప్రభుత్వాల పాలనలో లక్షెట్టిపేట పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో తెలియజెప్పాలన్నారు. సర్కారు మహిళలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే వారి పేరిట గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిందన్నారు. ప్రజలు ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించారని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇతర పార్టీలు బుదరజల్లే ప్రయత్నా లు చేస్తున్నాయని, వాటికి బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజులను చేశారన్నారు. కుడిపక్కన ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎడమ పక్కన గూడెం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరందిస్తున్నారని, ఇది గిట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే కేంద్రం తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కొత్తగా పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. యువ నాయకుడు, నడిపల్లి చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందని ఇల్లు లేదని, ఇది కేసీఆర్ సర్కారుతోనే సాధ్యమైందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, కౌన్సిలర్లు సురేశ్నాయక్, ఓరుగంటి శ్రీకాంత్, చాతరాజు రాజన్న, మెట్టు కళ్యాణి, ఉమాదేవి, షభాన, గొడిసెల లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ గోళ్ల కాంతయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు వెంకటస్వామి గౌడ్, షాహెద్ అలీ, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, కొత్త వెంకటేశ్వర్లు, పెటెం తిరుపతి, అంకతి గంగాధర్, రాందేని తిరుపతి, బానాల రమేశ్, నడిమెట్ల రాజన్న, అంకతి కిషన్, కార్యకర్తలు, నాయకులు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.