రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
శాంతినగర్లో స్థల పరిశీలన
మాదాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం
నిర్మల్ అర్బన్, మే 20 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని త్వరలోనే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటు స్థలాన్ని మంత్రి శుక్రవారం పరిశీలించారు. దేశ ప్రజలకు పీవీ ఎంతో చేశారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. రాజనీతి వేత్త పీవీని గత ప్రభుత్వాలు విస్మరించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పీవీ జయంతి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ వాణిదేవి తదితరులను విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మండల మాజీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి, నాయకులు పాల్ధె మహేందర్, నర్సాగౌడ్, కొండ శ్రీధర్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జుట్టు గజేందర్ ఉన్నారు.
జిల్లా ఏర్పాటుతో మెరుగైన సదుపాయాలు
నూతన జిల్లా ఏర్పాటుతో నిర్మల్లో అన్ని సదుపాయాలు మెరుగుపడుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నూతనంగా మంజూరైన ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం విద్యా రంగానికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’తో విద్యా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమైన మూల్యాంకన కేంద్రాన్ని అధ్యాపకుల విజ్ఞప్తి మేరకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులతో మాట్లాడి జిల్లాకు తీసుకొచ్చామన్నారు. దీంతో అధ్యాపకులకు వ్యయప్రయాసలు దూరమయ్యాయని పేర్కొన్నారు. అనంతనం అధ్యాపకులు మంత్రిని ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఐఈవో పరశురాం, అధ్యాపకులు సత్యపాల్, మురళి, శంకర్ ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే ఆలయాలకు మహర్దశ
సోన్, మే 20 : తెలంగాణ ఏర్పాటు తర్వాతే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యా రు. ఆలయ అర్చకులు, మహిళలు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.10 లక్షల ని ధులతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ని ర్మించామని, మరో రూ.15 లక్షల నిధులు మం జూరు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయానికి రూ. 30 లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.30 లక్షలు, సాయిబా బా ఆలయానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. మన పక్క జిల్లా నిజామాబాద్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బా క్సింగ్ 52 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమన్నారు. యువత ఆటల్లో రాణిస్తూ దేశానికి, రాష్ర్టానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. జడ్పీటీసీ జీవన్రెడ్డి, సర్పంచ్ రాజనర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాం కిషన్రెడ్డి, నిర్మల్ మండల మాజీ కన్వీనర్ ముత్యంరెడ్డి, తహసీల్దార్ హిమబిందు పాల్గొన్నారు.