భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, బీఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 14: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పూల మాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ అని, దేశానికి దశ, దిశను నిర్థేశించిన ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు మాట్లాడుతూ భారతరాజ్యాంగాన్ని తన భుజస్కందాలపై వేసుకుని తయారుచేశారని, భారత రాజ్యాంగం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
రాముడి పేరుతో దేశాన్ని ముక్కలు చేసే కుట్రలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. అంబేద్కర్ కృషి చేసి తెచ్చిన రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రదాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండక పోతే అణగారిన కులాలకు రిజర్వేషన్ ఉండేదా అని గుర్తుంచుకోవాలని, చిన్న రాష్ర్టాల ఏర్పాటుతోనే అభివృధ్ధి సాధ్యపడుతుందని అంబేద్కర్ భావించారని , ఆ మేరకు కేసీఆర్ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని, ఈ విషయంలో బీజేపీ చేస్తున్న కుట్రలు సాగవ న్నారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాటం రాజేశం, మాలమహానాడు ఆఫ్ ఇండియారాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్, నస్పూర్ పట్టణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శ్రీపతి, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశం, మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధు, ఎంఆర్పిఎస్ నాయకులు గొడిసెల దశరథం, జెట్టి చరణ్దాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
జాతీయ మానవ హక్కులు, మహిళా, శిశు సంరక్షణ సమితి జిల్లా జనరల్ సెక్రటరీ కోరే శ్రీనివాస్, కొమ్మ రమేశ్, పుల్యాల రాజమౌళి, మల్లె శ్రీనివాస్, శ్రీకాంత్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పీఆర్టీయూ తెలంగాణ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి వేణుగోపాల్, ఎస్ గంగాధర్, వీరశంకర్, రవికాంతారావు, ఓవి భారతి, శైలజ, రామకృష్ణ, కావిరి సాం బయ్య, రామ్మోహన్రెడ్డి, సంపత్కుమార్, తిరుమలేష్, తోటపల్లి భూమన్న, ఎనగందుల సాగర్, తదితరులు పాల్గొన్నారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యం లో నిర్వహించిన వేడుకల్లో నాయకులు కైలాసం, గుర్రాల రాజావేణు, బీ కిరణ్, దేవదాస్, తిరుపతి, ఎం ఆగాచారి, దిలీప్, లక్ష్మీరాజం పాల్గొన్నారు.
హాజీపూర్, ఏప్రిల్ 14 : హాజీపూర్ మండల తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్డీవో రాములు, డీఆర్డీవో కిషన్,తహసీల్దార్ సతీశ్ కుమార్తో కలిసి హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ముగ్గుల పోటీ నిర్వహించి, విజేతలతో పాటు పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఏం రాజన్న, డీపీఎం వేణు, ఆర్డీవో కార్యాలయం ఎన్నికల డీటీ గడియారం శ్రీహరితో పాటు మండల సమాఖ్యలోని మహిళలు పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్వంలో ..తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) సంఘం కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో రాష్ట్ర అటవీశాఖ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పొన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాంకుమార్, కెజియా రాణి, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రాణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఏప్రిల్14: దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ పాల్గొన్నారు. తాళ్లపేట నుంచి యువకులు బైక్ ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎల్.బాపు, ఆర్య వైశ్య సంఘం మండల అధ్యక్షుడు కొత్త శ్రవణ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్, పూసల సంఘం అధ్యక్షుడు చీర్ల వెంకటేశ్వర్లు, ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు విజయ, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 14: నస్పూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన వేడుకల్లో సీసీసీ కార్నర్ వద్ద ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, జాతీయ మాల మహానాడు, సీసీఐ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్ వద్ద గర్శె రామస్వామి, జోగుల మల్లయ్య, మేకల దాసులు, తాళ్లపల్లి పునరావాసకాలనీలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు పాల్గొన్నారు.
జన్నారం, ఏప్రిల్ 14 : మండల కేంద్రంతో పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సిటిమల భరత్కుమార్, దళిత సేన అద్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జాడి రాజన్న, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, అధ్యక్షుడు ముజఫర్అలీఖాన్, దముక కమలాకర్, ప్రభుదాస్, ఇందయ్య, దుమల్ల రమేశ్, కోడూరి చంద్రయ్య, గోపి సత్యనారాయణ, ప్రవీణ్, బీ ప్రకాశ్ నాయక్, ప్రశాంత్, శివ, సుధాకర్నాయక్, జాడి గంగాధర్, మల్లయ్య తదితరలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, ఏప్రిల్ 14: లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. ర్యాలీలు తీసి, ప్రభుత్వ దవాఖాన రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో అంబేద్కర్ సంఘం నాయకులు ఆవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న, దమ్మ నారాయణ, శనిగారపు లింగన్న, మాలెం చిన్నయ్య, చిప్పకుర్తి నారాయణ, ముల్కల్ల రాందా స్, లింగన్న, రవి, రాజు, రమేశ్, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, మెట్టు రాజు, ఆసాది పురుషోత్తం, కాంగ్రెస్ నాయకులు చెల్ల నాగముషణం, ఆరీఫ్, చింత అశోక్, రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, 14 : తాండూర్ మండల కేంద్రంతో పాలు పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకలు, ర్యాలీల్లో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు జాడి పోశం, ఎంపీటీసీలు సిరంగి శంకర్, సూరం రవీందర్రెడ్డి, రెబ్బెన యశోద, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ఖాన్, నేతకాని సంఘం మండల అధ్యక్షుడు గొర్లపెల్లి విజయ్, అంబేద్కర్ సంఘం నాయకలు దుర్గం శ్రీనివాస్, గొర్లపెల్లి వెంకటేశ్, దుర్గం లక్ష్మీనారాయణ, గోమాస తిరుపతి, శివ, దుర్గం మోహన్, అంబేద్కర్, నేతకాని సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల, ఏప్రిల్ 14 : నెన్నెల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు గట్టు మల్లేశ్, భానేశ్, ఎంపీటీసీ దాగం రమేశ్, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్, శంకర్, తిరుపతి, తదితరులున్నారు.
కాసిపేట, ఏప్రిల్ 14 : కాసిపేట మండల కేంద్రంతో పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ముత్యంపలిలో వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, ్ల మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, దాసరి శంకర్, మద్దివేని వేణు, దాగం మల్లేశ్, లంక లక్ష్మణ్, లక్షణ్దాస్, గోలేటి స్వామి, వేల్పుల గంగ, రామిళ్ల కిష్టయ్య, కోమటిచేనులో మాజీ సహకార చైర్మన్ పూస్కూరి వంశీకృష్ణారావు, రాంటెంకి వాస్దేవ్, ఎంపీటీసీ చంద్రమోళి, మాజీ సర్పంచ్ రాంటెంకి శ్రీనివాస్, మాసు సుధాకర్, దుర్గం సాగర్,
సూర్య ప్రకాశ్, కాసిపేటలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జాడి పోశం, సింగిల్ విండో చైర్మన్ నీలా రాంచందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, అగ్గి స్వామి, సిద్ధం తిరుపతి, మైదం రమేశ్, కొండాపూర్ యాపలో తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హన్మంతు, ప్రధాన కార్యదర్శి కుర్సింగ తిరుపతి, సుధాకర్ రెడ్డి, రాజాగౌడ్, మహంకాళి, సోమగూడెంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణ, సంకె రవి, సపాట్ మల్లేశ్, బోగె పోశం, సిద్ధయ్య, బూడిద రమేశ్, కిరణ్, వాకర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.
కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, దాసరి శంకర్, నామసాని రాజు, మద్దివేణి వేణు, దాగం మల్లేశ్, గొడిశెల భీమయ్య, లంక లక్ష్మణ్, లక్ష్మణ్దాస్, గోలేటి స్వామి, వేల్పుల గంగ, రామిళ్ల కిష్టయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 14: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, బీజెపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడి రమేశ్, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు మణిరామ్సింగ్, పలు దళిత సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళుల ర్పించారు. 11వ వార్డులో తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పాల్గొన్నారు. గురుకుల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మజ్జిగ పంపిణీ చేశారు. అమ్మ ఒడి, జనహిత సేవా సమితి, బాయిజమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్య కూడళ్ల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
చెన్నూర్, ఏప్రిల్ 14: చెన్నూర్ పాత బస్స్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అంబేద్కర్ సంఘం నాయకులు,పలు పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు, పలు కుల సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఎమ్మార్పీఎస్ (టీఎస్) నాయకులు నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా ఇన్చార్జి తగరం మ ధురాజ్, నాయకులు ప్రశాంత్, అశోక్, రామయ్య, సతీశ్, శేఖర్, నాగయ్య పాల్గొన్నారు.
మందమర్రి, ఏప్రిల్ 14: మందమర్రి పట్టణంలోని మార్కెట్ సమీపంలో గల అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన వేడుకల్లో మ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గజ్జెల చందర్, మొయ్య రాంబాబు, కనకం రవీందర్, నెరువట్ల శ్రీనివాస్, సకినాల శంకర్, ఉప్పులేటి నరేశ్, శనిగారపు కుమార్, వాసాల సంపత్, దాసరి రాజనర్సు, ఎండీ సలామొద్దీన్, నెరువట్ల దేవయ్య, కొండిళ్ళ శ్రీనివాస్, తుంగపిండి ఉపేందర్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఎండీ షరీఫ్, మంతెన సుమన్, కనకం రాజు, రామకృష్ణ, నెరువట్ల శశాంక్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఏప్రిల్ 14 : కోటపల్లి తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు ఎమ్మార్పీఎస్, నేతకాని సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. మల్లంపేట, లింగన్నపేట, రొయ్యలపల్లి గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.
భీమారం, ఏప్రిల్ 14 : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పోడెటి రవి, నాయకులు గుడిమల్ల వెంకటిమేస్త్రీ, ఆత్కూరి రాము, కలగూర రమేశ్, తగురం రాజ్ కుమార్, గాలిపల్లి నాగభూషణ్, వేముల ప్రణీత్ గౌడ్, కోట రవి, గాలిపల్లి శ్రీనివాస్, చెకూర్తి సత్యనారాయణ రెడ్డి, బానోత్ అమర్ సింగ్ నాయక్, చిలకాని కనకయ్య, దరవత్ శంకర్, బోగే సమ్మయ్య, గోదారి తిరుపతి, ఓడెటి బలరాంరెడ్డి, దుర్గం స్వామి, దాసరి మణిదీపక్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, ఏప్రిల్ 14: మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీవో సత్యనారాయణ, ఇందారం గ్రామంలో డీఎస్పీ ఆధ్వర్యంలో చెన్నూర్ నియోజకవర్గం అధ్యక్షుడు రేగుంట రాకేశ్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, ఏప్రిల్14: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రాజేశ్వర్, జడ్పీటీసీ వేల్పుల రవి, మాజీ సర్పంచ్లు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి ఏప్రిల్ 14: మందమర్రి పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్, సీనియర్ అసిస్టెంట్ వీ ప్రవీణ్కుమార్, బెక్కం ప్రసాద్, మామిడిపల్లి తిరుపతి, గోలె అశోక్ చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 14: రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో, సింగరేణి గనులు, డిపార్ట్మెంట్లు కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సింగరేణి ఏరియా దవాఖాన ఏసీఎంవో డా. ఉష, బీఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 14 : ప్రజాస్వామ్యం బలోపేతం కావడం, అసమానతలను రూపుమాపడంలో అంబేదర్ చేసిన కృషి మరువలేనిదని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆదివారం అంబేదర్ జయంతి పురసరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు జీవన్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, అదనపు ఎస్పీ ప్రభాకర్తో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. అనంతరం కల్టెరేట్లో అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ నెల 15వ తేదీ వరకు నూతన ఓటరు నమోదుకు అవకాశం కల్పించామని, అర్హులందరూ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గురుకులాలు, పలు సంఘాల ఆధ్వర్యంలో అంబేదర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. పీటీజీ గురుకులంలో వేడుకల్లో ప్రిన్సిపాల్ సురేశ్, ఆర్టీసీ డిపోలో మేనేజర్ విశ్వనాథ్, కార్యాలయాల్లో సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 14: రాజురా గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి రాందాస్ గ్రామస్తులతో కలిసి అంబేదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయ్, విక్రమ్, సంజీవ్, మహేశ్, మల్లయ్య పాల్గొన్నారు.
లింగాపూర్, ఏప్రిల్ 14: లింగాపూర్ మండలంలో నిర్వహించిన వేడుకల్లో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తదితరులున్నారు.
తిర్యాణి, ఏప్రిల్ 14 : మండలంలోని సుంగాపూర్, ఉల్లిపిట్ట, తిర్యాణి గ్రామాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు దుర్గం రాజయ్య, ఉపాధ్యక్షుడు జుమ్మిడి క్రిష్టయ్య, గోపాల్, ప్రధాన కార్యదర్శి జాడి భూమయ్య, కార్యదర్శి దుర్గం పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ సుధాకర్, తహసీల్ కార్యాలయంలో ఎంఆర్ఐ వివేక్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ కేదరి, సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రెబ్బెన, ఏప్రిల్ 14 : మండలంలోని నిర్వహించిన కార్యక్రమల్లో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ మహేశ్గౌడ్, ఎంపీటీసీ మధునయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
జైనూర్, ఏప్రిల్ 14: జైనూర్లోని అంబేదర్ చౌక్, గ్రామ పంచాయతీ కార్యాలయం, జంగాంలో అం బేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అంబేదర్ జయంతి ఉత్సవ అధ్యక్షుడు కాంబ్లే బాబాసాహెబ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, సహకార సంఘం చైర్మన్ హన్నుపటేల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కుడ్మెత విశ్వనాథ్, మాజీ సర్పంచ్లు, అంబేదర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కామ్లె బాబా సాహెబ్, నాయకులు పాల్గొన్నారు.
పెంచికల్ పేట్, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా యువజన సంఘాలు డీజేలతో ర్యాలీ తీసి నృత్యం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భక్తు రామచందర్, యువజన సంఘాలు, అంబేదర్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కౌటాల, ఏప్రిల్ 14 : కౌటలలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా ఎమ్మార్సీలో ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి సదాశివపేట వరకు భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ శిరీష, జెత్వాన్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షుడు పత్రు, ఉపాధ్యక్షుడు కిశోర్, కోశాధికారి భీంరావ్, సంఘం నాయకులు జానికిరావు, అశోక్, గోమాజీ, గోపాల్, కుర్మదాస్, పత్రు, మారుతి, శంకర్, దౌలత్, కాంప్లెక్స్ హెచ్ఎంలు హన్మంతు, నానాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెజ్జూర్, ఏప్రిల్ 14 : బెజ్జూర్తో పాటు కుకుడ, మర్తిడి, కాటెపల్లి, పోతెపల్లి, సలుగుపల్లి, పాపన్పేట, సోమిని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల్ జెండాను ఎగుర వేసి బుద్ధ వందన ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఉపాసక, ఉపాసికలు పాల్గొన్నారు.
దహెగాం, ఏప్రిల్ 14 : మండల కేంద్రంతో పాటు ఇట్యాల, కొత్మీర్, బీబ్రా, ఐనం, హత్తిని, గిరవెల్లి, కర్జీ, పీపీ రావు కాలనీ గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), ఏప్రిల్ 14 : పట్టణంలోని అంబేద్కర్ భవన్, జక్కాపూర్, డోర్పల్లి, పెద్దబండ, లోనవెల్లి, పారిగాం గ్రామాల్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, అంబేద్కర్ సంఘం నాయకులు, నాయకులు పాల్గొన్నారు.