ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు వెంకటేశ్దోత్రే, బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వివేక్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య,
ఆత్రం సక్కుతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకాలు చేశారు. పంచశీల జెండాలను ఎగరవేశారు. ప్రధాన చౌరస్తాల్లో ర్యాలీలు తీస్తూ నినాదాలు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.